Dalai Lama: చైనా నాతో మాట్లాడాలనుకుంటోంది… దలైలామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalai Lama: చైనా తనతో మాట్లాడాలనుకుంటోందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. తాను చైనాతో చర్చలకు సిద్ధమని అయితే టిబెట్ స్వాతంత్య్రం కోరుకోవడం లేదని దలైలామా తేల్చిచెప్పారు. తన 88వ పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని చైనా గ్రహించిందని, చైనా ప్రభుత్వంతో చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఎల్లప్పుడూ టిబెటన్ ప్రజల తరపున మాట్లాడటానికి సిద్ధంగా ఉంటానని.. టిబెటన్ ప్రజల ఆత్మ చాలా బలంగా ఉందని, ఇప్పుడు చైనా కూడా గ్రహించింది కాబట్టే టిబెటన్ సమస్యలను ఎదుర్కోవటానికి, చైనా వారు తనను సంప్రదించాలనుకుంటున్నారని దలైలామా అన్నారు. చైనాతో చర్చలకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Read also: Prabhas: బిగ్ సర్ప్రైజ్ రెడీ.. Project K అంటే ఏంటి?
Also Read
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
తాము స్వాతంత్ర్యం కోరుకోవడం లేదని.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగానే ఉండాలని చాలా ఏళ్ల నుంచి నిర్ణయించుకున్నాం.. ఇప్పుడు చైనా మారుతోంది. చైనీయులు అధికారికంగా లేదా అనధికారికంగా నన్ను సంప్రదించాలనుకుంటున్నారు అని ఆయన చెప్పారు. టిబెటన్ బౌద్ధుల ఆధ్యాత్మిక నాయకుడు మరియు నోబెల్ గ్రహీత అయిన దలైలామా జూన్ 6, 1935న లామో తొండప్గా జన్మించిన అతను రెండు సంవత్సరాల తరువాత దలైలామా యొక్క 14వ అవతారంగా గుర్తించబడ్డాడు. టిబెట్ రాజధాని లాసా యొక్క పవిత్ర నగరానికి తరలించబడ్డాడు. అక్టోబరు 1950లో, వేలాది మంది చైనా సైనికులు టిబెట్లోకి ప్రవేశించి దానిని చైనాలో భాగమని ప్రకటించారు. తరువాతి కొన్ని సంవత్సరాలలో, బీజింగ్ టిబెట్పై తన పట్టును బిగించింది చైనా పాలనపై టిబెట్లో ప్రతిఘటన వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. పరిస్థితి మరింత అస్థిరంగా మారడంతో, దలైలామా 1959లో తన జన్మ భూమిని వదిలి పొరుగున ఉన్న భారతదేశానికి పారిపోవలసి వచ్చింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పించారు మరియు అప్పటి నుండి అతను హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రవాసంలో ఉన్న టిబెటన్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. దలైలామా వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరియు టిబెట్ను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని చైనా ఆరోపించింది. దలైలామాను విభజన వ్యక్తిగా చైనా పరిగణిస్తోంది. అయితే తాను స్వాతంత్ర్యం కోరుకోవడం లేదని,.. టిబెటన్లందరికీ నిజమైన స్వయంప్రతిపత్తి కావాలని దలైలామా పట్టుబట్టారు.
- Tags
- china
- Dalai Lama.
- tibet
- To Talk
- Wants
తాజావార్తలు
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!