China: శుభవార్త.. భారతీయులపై వీసా నిషేధాన్ని ఎత్తేసిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత నివాసం ఉన్న విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా కాలేజీలు, వర్సిటీల్లో తిరిగి చేరాలనుకునే భారత విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటున్నది.
చైనా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఆగిపోయిన తమ చదువులను కొనసాగించేందుకు ఆసక్తిగా వేల మంది భారతీయ విద్యార్థుల విజ్ఞప్తులను ప్రాసెస్ చేస్తోంది. కొవిడ్ వీసా విధానంలో మార్పు చేస్తూ భారత్లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. చైనాలో తమ ఉద్యోగాలను కొనసాగించాలనుకుంటున్న విదేశీయులు, వారి కుటుంబ సభ్యుల వీసా దరఖాస్తులను ఆమోదిస్తామని ప్రకటించింది. భారతీయులకు తోడు.. చైనా పౌరులు, చైనా శాశ్వత నివాస పర్మిట్లు ఉన్న విదేశీయులు, ఈ దేశంలో పనిచేసే విదేశీయుల బంధువులు కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పర్యాటక, ప్రైవేటు అవసరాల కోసం ఇచ్చే వీసాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
భారతీయులకు తోడు వివిధ కంపెనీల కోసం పనిచేసే అనేక మంది చైనా ఉద్యోగులు కూడా భారత్లో చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. స్వదేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో కొందరిని తమ దేశంలోకి అనుమతిస్తామని డ్రాగన్ ఏప్రిల్లో ప్రకటించింది. అలాంటివారి వివరాలను సేకరించాలని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయానికి సూచించింది. దేశంలో ఇటీవల కేసులు పెరిగిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విదేశీయులను అనుమతించడానికి సుముఖంగా లేదు. వీసాలపై ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించే అంశంపై చైనా స్పష్టత ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!