Manish Sisodia: లిక్కర్ స్కామ్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం.. అరెస్ట్ చేసే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI Raids On Delhi Deputy Chief Minister manish sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు నమోదు అయ్యాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. దీంట్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఏ1 నిందితుడిగా చేర్చింది. తొమ్మిది నెలల క్రితం అమలు చేయబడి.. గత నెల వరకు అమలులో ఉన్న ఢిల్లీ కొత్త మద్యం పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. మనీష్ సిసోడియాతో పాటు ఢిల్లీ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపి కృష్ణ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మనీష్ సిసోడియా నివాసంతో పాటు ఢిల్లీలో 21 చోట్ల ఏడు రాష్ట్రాలు/యూటీల్లో 10 చోట్ల మొత్తంగా 31 చోట్ల సీబీఐ దాడులు చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అనే లిక్కర్ వ్యాపారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇండో స్పిరిట్ పేరులో బెంగళూర్ కేంద్రంగా ఆయన లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏ14గా ఈయన పేరును చేర్చారు. అరుణ్ రాంచంద్ర పిళ్లై నుంచి రూ.2.5కోట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎంకు ఇచ్చినట్లు సీబీఐకి సమాచారం ఉంది. టెండర్ దక్కించుకునేందుకు ఈ డబ్బును ముట్టచెప్పినట్లు సమాచారం. హైదరాబాద్, బెంగళూర్ లో ఉన్న రామచంద్ర పిళ్లై ఇంట్లో, కార్యాలయాల్లో కూడా సీబీఐ సోదాలు చేస్తోంది.
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Read Also: Chopper Makes Emergency Landing: సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మధ్యం దుకాణాల టెండర్లు దక్కించుకునే సమయంలో క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ అధికారులు వెల్లడిస్తున్నారు. మద్యం దుకాణాల స్కామ్ లో పలు కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఎవరికి ఎంత ముట్టచెప్పారనే కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది. సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే సిసోడియాపై దాడులు చేస్తోందని ఆప్ తో పాటు సమాజ్ వాాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ప్రమాదం అరుదైన ఘటన.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!