Reduce Working Hours: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. అక్కడ వారంలో 40 గంటలే పని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో 40 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతోంది.. ఇది మన దగ్గర అని కలలు కనొద్దు.. ఎందుకంటే.. ఇది భారత్లో కాదు.. చిలీలో.. ఈ దేశం పని గంటలను వారానికి 40కి తగ్గించాలని యోచిస్తోంది.. పని గంటలను తగ్గించడానికి చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ బిల్లును తీసుకొచ్చారు.. చిలీ రాజ్యాంగంలోని ఒక నిబంధన ప్రకారం.. అధ్యక్షుడు ఆదేశించినప్పుడు బిల్లును చట్టసభలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ప్రభుత్వం మంగళవారం మాట్లాడుతూ.. దేశంలో పని గంటలను తగ్గించే బిల్లును ఆమోదించడానికి మరియు ప్రచార హామీని నెరవేర్చడానికి ప్రయత్నాలను పునరుద్ధరించింది. ఐదేళ్లలోపు పని గంటలను వారానికి 45 నుండి 40 గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిల్లును.. 2017లో అప్పటి చట్టసభ సభ్యులు మరియు ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో ప్రవేశపెట్టినప్పటి నుండి కాంగ్రెస్లో నిలిచిపోయింది.
Read Also: Mekathoti Sucharita: పవన్ కల్యాణ్ కలలు కంటున్నారు..
Also Read
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
అయితే, ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ పనిగంటల్ని తగ్గిస్తూ ‘అత్యవసర’ బిల్లుగా పరిగణలోకి తీసుకున్నారు. సభ్యులు అంగీకారంతో ఆ బిల్లు అమలు కానుంది. చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పనిగంటల్ని తగ్గించడంతో పాటు అదనంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు సైతం పనిగంటల్ని తగ్గించే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.. అధ్యక్ష భవనంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బోరిక్ మాట్లాడుతూ.. కొత్త చిలీకి మమ్మల్ని దగ్గరికి తీసుకురావడానికి ఈ మెరుగుదలలు చాలా అవసరం అన్నారు.. కాగా, ప్రపంచంలోని అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుగా ఉంది చిలీ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సమయంలో మరియు మహమ్మారి అనంతర పునరుద్ధరణ తర్వాత బలమైన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో అక్కడి వామపక్ష ప్రభుత్వం చిన్న, మధ్య మరియు పెద్ద కంపెనీల ప్రతినిధులతో పాటు యూనియన్లు మరియు వర్కర్ ఫెడరేషన్లతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చింది.. ఉభయ సభలు వీలైనంత త్వరగా బిల్లుపై ఓటు వేసి ఆమోదం పొందాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు బోరిక్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!