India at UN: ఆ 5 దేశాలు అన్ని దేశాల కన్నా ఎక్కువా..? యూఎన్ఎస్సీ నిర్మాణంపై భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UN: భారతదేశం మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) నిర్మాణంపై నిలదీసింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి, రుచిరా కాంబోజ్ భద్రతా మండలి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. ఐదు దేశాలు ఇతర దేశాలను ఇతరుల కన్నా ఎక్కువ చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి అందర్ని కలుపుకుపోవడం లేదని చెప్పింది. యూఎన్ లో ప్రపంచ శాంతి కోసం జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా కాంబోజ్ మాట్లాడారు.
Read Also: Cyclone Mocha: రాష్ట్రానికి ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను ముప్పు.. ఆందోళనలో రైతులు
Also Read
ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్యదేశాల హోదా లేదని భారత్ మరోమారు ప్రస్తావించింది. యూఎన్ అసమానతలను తొలగిస్తుందా..? లేదా వాటిని అలాగే శాశ్వతంగా ఉంచుతుందా..? అని ప్రశ్నించింది. భద్రతా మండలిలో దశాబ్ధాలుగా సంస్కరణలు చేయలేదని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యూఎన్ కౌన్సిల్ విశ్వసనీయతను మెరుగుపరచగలమా..? అని రుచికా కాంబోజ్ ప్రశ్నించారు. మొత్తం ప్రపంచానికి యూఎన్ నాయకత్వం అందించే సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించాలంటే కౌన్సిల్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింతగా ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ కోరింది. వాయిస్ లేని వారికి వాయిస్ ఇస్తేనే సమర్థవంతమైన పరిష్కారాలను అందిగలమని భారత్ తరుపున రుచికా కాంబోజ్ అన్నారు.
ఐక్యరాజ్యసమితి ఏర్పడి నాటి నుంచి శాశ్వత సభ్యదేశాలుగా చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకేలు ఉన్నాయి. ఈ 5 దేశాలు మాత్రమే వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. మరో 10 దేశాలు ప్రతీ రెండేళ్ల కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఉంటాయి. గత కొన్నేళ్లుగా భారతదేశానికి శాశ్వత సభ్యదేశం హోదా కల్పించాలని కోరుతోంది. ఇదే విధంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని దేశాలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించేలా భద్రతా మండలిని సంస్కరించాలని కోరుతోంది. జర్మనీ, ఇండియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాలకు శాశ్వత సభ్యదేశాల హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇండియాకు శాశ్వత సభ్యదేశ హోదా ఇచ్చేందుకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే సమ్మతించినా.. డ్రాగన్ కంట్రీ చైనా పలు సందర్భాల్లో మోకాలడ్డుతోంది.
- Tags
- India at UN
- Ruchira Kamboj
- UN
- UNSC
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!