Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న అల్లర్లు..
- భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్ అధికారులు..
- బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతతో ఇప్పటికే కోల్కతా చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis: బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పెట్టి పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ రాలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా భారత్ వైపుకు పయనమైనట్లు కొన్ని వార్త సంస్థలు తెలిపాయి.
Read Also: Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?
Also Read
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
కాగా, బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు ఇవాళ (సోమవారం) హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్లిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలను బీఎస్ఎఫ్ వెల్లడించింది. అయితే, బంగ్లాదేశ్తో భారత్ 4000 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది.
Read Also: Kannappa: ‘కన్నప్ప’లో ముండడుగా దేవరాజ్.. లుక్ రిలీజ్
అయితే, షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకు వస్తామన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపమని పౌరులను కోరుతున్నాం.. గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తాము అని ఆర్మీ చీఫ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదన్నారు. ఈ రాత్రికి సంక్షోభానికి ఓ పరిష్కారం దొరుకుతుంది అని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ తెలిపారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?