Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
- బీఎల్ఏ దాడుల్లో హతమవుతున్న పాక్ భద్రతా సిబ్బంది.
- పోలీసులకు కనీస గౌరవం కూడా ఇవ్వని దాయాది దేశం..
- టెంపోలో పోలీసులు శవపేటికల తరలింపు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని బలూచిస్తాన్లో తిరుగుబాటుదారుల దాడిలో మరణించిన పోలీసుల సంఖ్య 42కు పెరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇవే. ఈ దాడిలో ముందు 9 మంది పోలీసులు మరణించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, బీఎల్ఏ తిరుగుబాటుదారులు వీరిలో చాలా మందిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మరణించిన వారి సంఖ్య నెమ్మదిగా బయటకు వస్తోంది. మరోవైపు, ఈ దాడిలో 54 మంది తిరుగుబాటుదారుల్ని చంపేశామని పాకిస్తాన్ చెబుతోంది.
ఇదిలా ఉంటే, చనిపోయిన సైనికులకు, పోలీసులకు పాకిస్తాన్ కనీస గౌరవాలు ఇవ్వడం లేదని మరోసారి నిరూపితమైంది. ఈ దాడిలో చనిపోయిన భద్రతా బలగాల పట్ల పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి దాడిలో మరణించి పోలీసుల శవపేటికల్ని ఓ టెంపో వాహనంలో తరలిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 10 మంది పోలీసుల మృతదేహాలను శవపేటికలో ఉంచి ఒక టెంపోలో ఎక్కిస్తున్నారు. దీనిని చూసిన ఒక పాకిస్తానీ పౌరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
‘‘ఒకప్పుడు పైన్ చెట్లకు ప్రసిద్ధి చెందిన జియారత్ ఇప్పుడు శవపేటికల ఉరేగింపుకు సాక్ష్యంగా ఉంది. ఈ పురాతన పైన్ చెట్లు శతాబ్ధాల చరిత్రను నిశ్శబ్దంగా చూస్తున్నాయి. పాక్ సైన్యం, ఐఎస్ఐ విధ్వంసక విధానాలు ఈ నగరాన్ని శవపేటికల నగరంగా మార్చాయి. ఈ విధానాలు బలూచిస్తాన్కు రక్తపాతం, బాధను మాత్రమే తీసుకువచ్చాయి. ప్రతీ శవపేటిక ఒక కుటుంబాన్ని, ఒక తల్లి కన్నీరును, వితంతువు దు:ఖాన్ని మోసుకెళ్తోంది’’ అని నెటిజన్ చేసిన భావోద్వేగ పోస్ట్ పాక్ వ్యాప్తంగా వైరల్గా మారింది.
ఎప్పటిలాగే ఈ దాడులకు సరిహద్దుకు బయట ఉన్న శక్తులే కారణమని నిందించాయి. చాలా మంది పోలీసుల్ని బీఎల్ఏ అపహరించింది. పాక్ ప్రభుత్వం వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 54 మంది తిరుగుబాటుదారులు హతమైనట్లు పాక్ చెబుతోంది. గాలింపు చర్యల్లో కిడ్నాప్కు గురైన పలువురు పోలీసుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ సైన్యం చెబుతోంది.
Once known as the Town of Junipers, home to one of the world’s oldest and largest juniper forests, #Ziarat is today witnessing a procession of coffins.
The ancient trees of Sanober have stood for centuries, silently watching history unfold. Today, they stand witness to yet… pic.twitter.com/cR4Tv7VilH
— Shahid Qazi (@QaziShahid786) July 8, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?