Bird Flu: బర్డ్ ఫ్లూ మరో మహమ్మారిగా మారుతుందా..? పరిశోధకులు ఏం చెబుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu: 2019లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ అన్ని దేశాల్లో మరణాలకు కారణమైంది. కోవిడ్-19 మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేకపోతోంది. ఇదిలా ఉంటే సమీప భవిష్యత్తులో మరో పాండెమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.
అయితే, ఈ సారి వచ్చే మహమ్మారి బర్డ్ ఫ్లూ అవుతుందా..? అంటే అందుకు అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. H5N1 అని పిలువబడే వ్యాధి ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2020 నుంచి బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా కన్జర్వేషర్ బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డయానా బెల్ అభిప్రాయపడ్డారు. 1997లో చైనాలో బాతుల్లో ఈ వ్యాధి ఉద్భవించిన తర్వాత పలు ప్రాంతాలకు వ్యాపించింది. పక్షులతో పాటు నాన్-ఏవియన్ జాతులను ప్రభావితం చేసింది.
Also Read
- Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
- Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
- New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్కు UN ఆమోదం
- Pickaxe Mountain: 'త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం' ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Also: Tiger attack: పెద్ద పులి దాడి చేసినా బెదరలేదు, ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడంటే..
డాక్టర్ బెల్ పరిశోధన ప్రకారం.. 2020 నుంచి 26 దేశాల్లోల అనేక క్షీరద జాతులు వైరస్ బారిన పడినట్లు నివేదించారు. ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు కూడా దీనికి ప్రభావితమయ్యాయి. బర్డ్ ఫ్లూ వల్ల వివిధ జంతు జాతుల్లో మరణాలు సంభవించాయి. మానవుల్లో సైతం ఈ వ్యాధి కనిపించింది. గతేడాది 23 దేశాల్లో 882 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీని ఫలితంగా 52 శాతం మరణాలు రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫౌల్ట్రీల నుంచి మానవుల్లోకి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది.
బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి సోకే ప్రమాదం ప్రస్తుతానికి లేనప్పటికీ, సమీప భవిష్యత్తులో అంటు వ్యాధిగా మారగల సామర్థ్యం గురించి పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీనిని మహమ్మారి ముప్పుగా పరిగణిస్తోంది. వైరస్ అనుకూలత, మరిన్ని జాతులకు హాని కలిగించే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు, నిఘా అవసరమని డాక్టర్ బెల్ హైలెట్ చేశారు. ఫౌల్ట్రీ పద్ధతుల్లో మార్పు చేయాలని, ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతుల నుంచి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!