Bangladesh: కరెన్సీ నోట్లపై నుంచి “జాతిపిత” ఫోటోని తీసేసిన యూనస్ సర్కార్..
- బంగ్లాదేశ్లో కొత్త కరెన్సీ నోట్లు..
- షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని తీసేసిన యూనస్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు.
గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ని బంగ్లా ప్రజల హృదయం నుంచి తుడిచేయాలని మహ్మద్ యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే, షేక్ హసీనా పార్టీ అవామీలీగ్ పార్టీని రద్దు చేశాడు. మొత్తంగా బంగ్లాదేశ్ జాతిపిత ఖ్యాతిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
Read Also: Operation Sindoor: పాక్ ప్రయోగించిన “టర్కీ బైరక్తర్ డ్రోన్ వలయాన్ని” భారత్ ఎలా ఛేదించింది..?
1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి కారణమైన ముజిబుర్ రెహమాన్ని 1975లో సైనిక తిరుగుబాటులో హత్య చేశారు. మొత్తం కుటుంబాన్ని హతమార్చారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి వేరే దేశంలో ఉండటంతో బతికిపోయారు. అప్పటి నుంచి ఆయన చిత్రపటం బంగ్లా కరెన్సీ అయిన టాకా నోట్లపై ఉండేది.
“కొత్త సిరీస్ మరియు డిజైన్ ప్రకారం, నోట్స్లో ఎటువంటి మానవ చిత్రాలు ఉండవు, బదులుగా సహజ ప్రకృతి దృశ్యాలు, సంప్రదాయాన్ని సూచించే వాటిని ప్రదర్శిస్తాయి” అని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ ఖాన్ చెబుతున్నారు. కొత్త నోట్లపై హిందూ, బుద్దిస్ట్ ఆలయాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఆదివారం మూడు నోట్లు విడుదల చేశారు. కొత్త నోట్లు కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కార్యాలయాలకు జారీ చేస్తామని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!