Pakistan: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాక్ ఆర్మీ , ప్రభుత్వం వణికిపోతోంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం, పాక్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ, బీఎల్ఏకి తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. వందలాది మంది సైనికులు, బీఎల్ఏ యోధులు మరణించారు. ఇదిలా ఉంటే, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆ దేశ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also: Best Selling Cars: అమ్మకాల్లో Tata Nexon దూకుడు.. జనవరిలో బెస్ట్సెల్లింగ్ కార్ల జాబితా ఇదిగో!
బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద పాకిస్తాన్ సైన్యం వద్ద కూడా లేని అత్యాధునిక అమెరికా ఆయుధాలు ఉన్నాయని ఆయన అన్నారు. యూఎస్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. బీఎల్ఏ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉందని, బీఎల్ఏ తిరుగుబాటుదారులు ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
బీఎల్ఏ యోధుల వద్ద రూ. 2 మిలియన్ల విలువైన రైఫిల్స్ ఉన్నాయి. మా దగ్గర ఆ రైఫిల్స్ లేవు. వారి వద్ద 4 వేలు-5వేల డాలర్ల థర్మల్ వెపన్ సైట్స్ కూడా ఉన్నాయి. వారి దగ్గర ఉన్న సైనిక సామాగ్రి మొత్తం దాదాపుగా 20,000 డాలర్లు. అది ఎక్కడి నుంచి వస్తోంది.? ఎవరు డబ్బు ఇస్తున్నారు’’ అని ఖవాజా ఆసిఫ్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాయం అందుతోందని చెప్పారు. బీఎల్ఏ ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తుందని చెప్పారు.
BREAKING:
Pakistani Defence Minister Khawaja Asif, speaking inside the National Assembly, admits that the government and army have failed to counter Baloch rebels in Balochistan.
He says the rebels are equipped with rifles, night vision devices, and other gear that even… pic.twitter.com/t3ZShkFoPJ
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) February 3, 2026