Covid New variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్. ఇజ్రాయెల్ సైంటిస్టులు ఏమంటున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ గతేడాదే అంతమైపోయిందనుకున్నాం. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో రోజురోజుకీ కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణతోపాటు 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పది రాష్ట్రాల నుంచి సేకరించిన 69 శాంపిల్స్లో బీఏ-2.75 అనే వేరియంట్ని గుర్తించామని డాక్టర్ షే ఫ్లీషాన్ తెలిపారు. ఇండియా సహా ఏడు ఇతర దేశాల నుంచి 85 సీక్వెన్స్లను అప్లోడ్ చేశామని చెప్పారు.
Rahul Gandhi: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ టూర్.. ప్లానేంటి?
Also Read
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
కొత్త వేరియంట్ వెలుగులోకి రావటం రానున్న రోజుల్లో తలెత్తనున్న వైరస్ విపరీత పరిణామాలకు నిదర్శనమని, ఈ వేరియంట్ ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర-27, పశ్చిమ బెంగాల్లో 13, హర్యానాలో 6, హిమాచల్ప్రదేశ్లో 3, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్లో 5, తెలంగాణలో 2, ఢిల్లీ, జమ్మూ, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 69 శాంపిల్స్. ఒకవైపు కరోనా వైరస్లో ఇలా కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తుంటే మరోవైపు ప్రజల్లో కొవిడ్ వ్యాప్తి పట్ల సీరియస్నెస్ లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.
మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. మెట్రో రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో మాస్కును ‘తప్పనిసరి’ చేయలేదు. మాస్కు లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామంటూ ప్రభుత్వం.. ప్రకటనలకే పరిమితమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటానికి ఇది కూడా ఒక కారణమని వైద్యులు అంటున్నారు. తెలంగాణలో సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 వందల 57 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యధికంగా 2 వందల 85 మంది మహమ్మారి బారిన పడటం గమనార్హం. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 7 వందల 47కి పెరిగింది.
Sand Mafia: ఇసుక స్మగ్లర్ల బరితెగింపు.. ఫారెస్ట్ అధికారులపై పెట్రోల్ దాడి
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!