Covid New variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్. ఇజ్రాయెల్ సైంటిస్టులు ఏమంటున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ గతేడాదే అంతమైపోయిందనుకున్నాం. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో రోజురోజుకీ కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణతోపాటు 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పది రాష్ట్రాల నుంచి సేకరించిన 69 శాంపిల్స్లో బీఏ-2.75 అనే వేరియంట్ని గుర్తించామని డాక్టర్ షే ఫ్లీషాన్ తెలిపారు. ఇండియా సహా ఏడు ఇతర దేశాల నుంచి 85 సీక్వెన్స్లను అప్లోడ్ చేశామని చెప్పారు.
Rahul Gandhi: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ టూర్.. ప్లానేంటి?
Also Read
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
కొత్త వేరియంట్ వెలుగులోకి రావటం రానున్న రోజుల్లో తలెత్తనున్న వైరస్ విపరీత పరిణామాలకు నిదర్శనమని, ఈ వేరియంట్ ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర-27, పశ్చిమ బెంగాల్లో 13, హర్యానాలో 6, హిమాచల్ప్రదేశ్లో 3, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్లో 5, తెలంగాణలో 2, ఢిల్లీ, జమ్మూ, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 69 శాంపిల్స్. ఒకవైపు కరోనా వైరస్లో ఇలా కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తుంటే మరోవైపు ప్రజల్లో కొవిడ్ వ్యాప్తి పట్ల సీరియస్నెస్ లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.
మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. మెట్రో రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో మాస్కును ‘తప్పనిసరి’ చేయలేదు. మాస్కు లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామంటూ ప్రభుత్వం.. ప్రకటనలకే పరిమితమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటానికి ఇది కూడా ఒక కారణమని వైద్యులు అంటున్నారు. తెలంగాణలో సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 వందల 57 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యధికంగా 2 వందల 85 మంది మహమ్మారి బారిన పడటం గమనార్హం. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 7 వందల 47కి పెరిగింది.
Sand Mafia: ఇసుక స్మగ్లర్ల బరితెగింపు.. ఫారెస్ట్ అధికారులపై పెట్రోల్ దాడి
తాజావార్తలు
-
Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..