Sand Mafia: ఇసుక స్మగ్లర్ల బరితెగింపు.. ఫారెస్ట్ అధికారులపై పెట్రోల్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తమ దారికి అడ్డువచ్చింది ఎవరైనా దాడులకు తెగబడుతూ బరితెగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులపై పెట్రోల్ పోసి దాడికి తెగబడ్డారు ఇసుక మాఫియా. తమకు అడ్డువచ్చారని అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులపై కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అటవీశాఖ జీప్పై పెట్రోల్ పోసి వాహనాన్ని తగలబెట్టి ప్రయత్నం చేశారు ఇసుకాసురులు. ఈ ఘటన కలకలం రేపింది.
Rahul Gandhi: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ టూర్.. ప్లానేంటి?
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామంలో ఇసుక అక్రమంగా ట్రాక్టర్లు తో తరలిస్తున్నారని దమ్మపేట FRO వెంకటలక్ష్మికి సమాచారం అందడంతో తన సిబ్బందితో రాత్రి 10గంటల సమయంలో దాడి చేయడానికి వెళ్ళారు. అటవీ శాఖ అధికారులు రోడ్ పై వారి జీప్తో తిరుగుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఇసుక స్మగ్లర్లు అటవీ శాఖ అధికారులు దాడి చేయడానికి ఎంతమంది వచ్చారో తెలుసుకున్నారు, కేవలం డ్రైవర్ రాజేష్, FRO వెంకటలక్ష్మీ, బేస్ క్యాంప్ గార్డ్ జాన్ రెడ్డి మాత్రమే ఉన్నారని తెలుసుకున్నారు.
దీంతో ఓ 20 మంది ఇసుక స్మగ్లర్లు వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అందరూ ఒక్కసారిగా రోడ్ పైకి వచ్చి అటవీ శాఖ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పుంటించే ప్రయత్నం చేశారు, అంతేకాకుండా అటవీ శాఖ అధికారులపై కర్రలతో దాడికి తెగబడ్డారు, కనీసం ఓ మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇసుక స్మగ్లర్లు తప్పతాగి విచక్షణ రహితంగా వ్యవహరించారు. అటవీశాఖ అధికారులు వీడియో తీసే ప్రయత్నం చేస్తుంటే అధికారులు చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ లు బలవంతంగా లాక్కున్నారు, ఇసుక స్మగ్లర్లు దాడిలో నుండి ఏదోవిధంగా బయట పడి ఫోన్ సిగ్నల్ రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఓ పది మంది పై ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!