Russia – Ukraine War: అనవసర ప్రయాణాలొద్దు.. భారతీయులకు హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avoid Non-Essential Travel To and Within Ukraine Says Indian Embassy: క్రిమియా, రష్యాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెనను ధ్వంసం చేయడంతో.. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే! దీంతో ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, కీవ్లోని భారత రాయబార కార్యాలయంతో నిత్యం సంప్రదింపులు కొనసాగించాలని కోరింది. తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంబసీకి తెలియజేయాలని, ఫలితంగా సహాయం చేసే విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని పేర్కొంది.
ఇదిలావుండగా.. కెర్బ్ వంతెను కూల్చినందుకు గాను ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు పలు చోట్ల రష్యా మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. సుమారు 84కిపైగా మిస్సైల్స్ ఉక్రెయిన్ భూభాగంలో విధ్వంసం సృష్టించగా.. ఈ దాడుల్లో సుమారు పది మంది పౌరులు మృతి చెందారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. తమను రెచ్చగొట్టేలా ఉక్రెయిన్ ఉగ్ర చర్యలకు పాల్పడిందని, అందుకు ప్రతిగానే ఈ క్షిపణి దాడులు చేయాల్సి వచ్చిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ తెలిపారు. ఇంకోసారి అలాంటి దాడులకు పాల్పడొద్దని కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడుల్ని ఖండించారు. తమ దేశాన్ని భూభాగంలో లేకుండా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, క్షిపణి దాడుల్లో తమ ఉక్రెయిన్ పౌరుల్లో చాలామంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!