Donald Trump: అధికారంలోకి వస్తే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో యూదులతో సమావేశమైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం లాస్ వేగాస్ లో రిపబ్లిక్ యూదు కూటమి సమావేశంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడు తిగిరి ఎన్నికైతే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులను మన దేశం నుంచి బయటకు రానీయకుండా చూస్తానని అన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మీకు ట్రావెల్ బ్యాన్ గుర్తుందా..? నేను అధ్యక్షుడినైతే మొదటిరోజే ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరిస్తానని చెప్పారు. 2017లో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ మరియు మొదట్లో, ఇరాక్ మరియు సూడాన్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులపై భారీ ఆంక్షలు విధించారు.
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
- US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
అయితే ఈ ఉత్తర్వులు మతపరమైన ఒక సమూహంపై వివక్ష చూపుతుందని కోర్టుల్లో సవాల్ చేశారు. ట్రంప్ దిగిపోయాక, జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత 2021లో మొదటి వారంలోనే ఈ నిషేధాన్ని రద్దు చేశాడు. బైడెన్ కన్నా పూర్వం ఉన్న ప్రభుత్వం అమెరికన్ కాని ముస్లింలపై నిషేధాన్ని విధిస్తే, బైడెన్ దీన్ని రద్దు చేయడం గర్వంగా ఉందని వైట్ హౌజ్ ప్రతినిధి చెప్పారు.
Read Also: Minister Harish Rao: డీకే శివకుమార్కు మంత్రి హరీశ్ థ్యాంక్స్.. డీకే నిజాలే చెప్పారు!
ఇజ్రాయిల్ మా మిత్రదేశం, మిత్రదేశాన్ని ఎన్నడూ లేనంతగా రక్షిస్తానని ట్రంప్ అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం నాగరికత-క్రూరత్వం, మంచి-చెడుల మధ్య పోరాటంగా ట్రంప్ అభివర్ణించారు. దీనికి ముందు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకు లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లను వెరీ స్మార్ట్ అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూను విమర్శించారు. తాజాగా ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడారు.
అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది చనిపోగా.. ఇజ్రాయిల్ గాజాపై జరిపిన దాడుల్లో 7000 మందికి పైగా మరణించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్న 200 మందికి పైగా ప్రజలను విడిపించేందుకు ఇజ్రాయిల్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ భూతల దాడులను ప్రారంభించింది.
తాజావార్తలు
-
Aman Sanger: భారతీయ కుర్రాడి సత్తా.. నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల యువకుడి స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!