Hamas: గాజాపై దాడి కారణంగానే ఆమ్స్టర్డామ్లో ఇజ్రాయెలీలపై దాడి
- గాజాపై దాడి కారణంగానే ఆమ్స్టర్డామ్లో ఇజ్రాయెలీలపై దాడి
- హమాస్ మిలిటెంట్ గ్రూప్ నేత సమీ అబు జుహ్రీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై ఇజ్రాయెల్ జరిపిస్తున్న మారణహోమానికి ప్రతీకారంగానే అమ్స్టర్డామ్లో ఇజ్రాయెల్ పౌరులపై దాడి జరిగిందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ నేత సమీ అబు జుహ్రీ పేర్కొన్నాడు. గాజాలో సామూహిక హత్యలు కారణంగానే పాలస్తీనా అనుకూల గుంపులు.. ఇజ్రాయెల్ సాకర్ అభిమానులపై దాడికి దారి తీసిందని చెప్పుకొచ్చాడు. మానవ హక్కులను గౌరవించడం, అలాగే ప్రాంతీయ, ప్రపంచ భద్రత, శాంతి కోసం గాజాలో మారణహోమం ఆపేయడం అవసరం అని జుహ్రీ స్పష్టం చేశాడు.
గురువారం నెదర్లాండ్లో పాలస్తీనీయులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ పౌరులపై ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఇజ్రాయెల్ పౌరులపై ఒక గుంపు మూక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాడికి సంబంధించి అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది. మక్కాబి టెల్ అవీవ్ అభిమానులు స్టేడియం నుంచి బయటకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా వెల్లడించింది.
Also Read
నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్లో గురువారం రాత్రి మక్కాబి టెల్ అవీవ్ వర్సెస్ అజాక్స్ ఆమ్స్టర్డామ్ మధ్య యూరోపా లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అభిమానులు నెదర్లాండ్స్కు వెళ్లారు. అయితే ఇదే అదునుగా పాలస్తీనా గుంపు రెచ్చిపోయింది. ఇజ్రాయెలీ సాకర్ అభిమానులుపై భౌతికదాడులకు పాల్పడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లుగానే చితకకొట్టారు. పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం.. ఇలా ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. దాడి చేయొద్దంటూ వేడుకున్నా.. కనికరించకుండా కొడుతూనే ఉన్నారు. డబ్బులు, పాస్పోర్టులు కూడా వారి దగ్గర నుంచి లాగేసుకున్నారు. దాడి చేసినవాళ్లు అరబిక్లో పాలస్తీనా నినాదాలు చేస్తూ చెలరేగిపోయారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ ఫుట్బాల్ అభిమానులను రప్పించేందుకు రెండు విమానాలను ఆమ్స్టర్డామ్కు పంపాలని అధికారులకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. అలాగే ఇజ్రాయెల్ పౌరులకు రక్షణ కల్పించాలని డచ్ అధికారులను కోరారు. పాలస్తీనీయుల దాడిలో దాదాపు 10 మంది ఇజ్రాయెలీయులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి వ్యక్తుల ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. దాడికి పాల్పడ్డవారు కొంత మందిని టార్గెట్ చేసుకుని.. పాస్పోర్టులు దొంగిలించనట్లుగా తెలుస్తోంది. తాజాగా హమాస్ స్పందిస్తూ…గాజాపై మారణహోమానికి ప్రతీకారంగా జరిగినట్లుగా వెల్లడించాడు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!