Modi America Tour: భారత్లో అమెరికా యాపిల్స్, వాల్నట్స్-బాదం పప్పులు చౌక.. కారణమదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi America Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారత్ కు సెమీకండక్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ, టెస్లా లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేకాకుండా అటు అమెరికా కూడా చాలా లాభపడింది. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో శెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్, వాల్నట్లు మరియు బాదం పప్పులు ఉన్నాయి. 2019లో అమెరికా నుంచి వచ్చే ఈ వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాన్ని విధించింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై అమెరికా సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం.
Read Also: Kamal Hassan: కమల్ హాసన్ని ఒక రేంజ్లో లేపుతున్నారు..కానీ అసలు విషయం ఇదా?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లాడు. అందులో భాగంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి సంబంధించిన 6 వివాదాలను ముగించాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాలను తొలగించేందుకు భారత్ కూడా అంగీకరించింది. 2018 సంవత్సరంలో జాతీయ భద్రతను ఉటంకిస్తూ.. భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం మరియు అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని అమెరికా నిర్ణయించింది. దీనికి ప్రతిస్పందనగా జూన్ 2019 లో భారతదేశం 28 US ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. ఇప్పుడు ఈ అదనపు దిగుమతి సుంకాన్ని తొలగించాలని భారతదేశం నిర్ణయించిన తర్వాత ఈ 8 అమెరికన్ ఉత్పత్తులకు ప్రస్తుతం మోస్ట్ ఫేవర్డ్ కంట్రీ (MFN) రేటు ఆధారంగా మాత్రమే దేశంలో ఛార్జీ విధించబడుతుంది.
Read Also: India vs China: స్మార్ట్ ఫోన్లే కాదు.. తయారీ విషయంలో చైనాను అధిగమిస్తున్న భారత్..!
వచ్చే 90 రోజుల్లో అమెరికా ఉత్పత్తులపై ఈ సుంకాలను క్రమంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు భారత్లో అమెరికన్ పప్పుపై 10 శాతం నుంచి 20 శాతం, పొడి బాదంపప్పుపై కిలోకు రూ.7, ఒలిచిన బాదంపప్పుపై కిలోకు రూ.20, వాల్నట్లపై 20 శాతం, యాపిల్స్పై 20 శాతం, బోరిక్ యాసిడ్పై 20 శాతం మరియు డయాగ్నొస్టిక్ రియాజెంట్లపై 20 శాతం అదనపు సుంకం తీసివేయబడుతుంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండనుంది. గత ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వస్తు వ్యాపారం $128.8 బిలియన్లకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 119.5 బిలియన్ డాలర్లు. అయితే యాపిల్స్ ను ఎగుమతి చేసుకోవడంలో వాషింగ్టన్ తర్వాత భారతదేశం ఉంది.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..