Modi America Tour: భారత్లో అమెరికా యాపిల్స్, వాల్నట్స్-బాదం పప్పులు చౌక.. కారణమదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi America Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారత్ కు సెమీకండక్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ, టెస్లా లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేకాకుండా అటు అమెరికా కూడా చాలా లాభపడింది. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో శెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్, వాల్నట్లు మరియు బాదం పప్పులు ఉన్నాయి. 2019లో అమెరికా నుంచి వచ్చే ఈ వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాన్ని విధించింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై అమెరికా సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం.
Read Also: Kamal Hassan: కమల్ హాసన్ని ఒక రేంజ్లో లేపుతున్నారు..కానీ అసలు విషయం ఇదా?
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లాడు. అందులో భాగంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి సంబంధించిన 6 వివాదాలను ముగించాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాలను తొలగించేందుకు భారత్ కూడా అంగీకరించింది. 2018 సంవత్సరంలో జాతీయ భద్రతను ఉటంకిస్తూ.. భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం మరియు అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని అమెరికా నిర్ణయించింది. దీనికి ప్రతిస్పందనగా జూన్ 2019 లో భారతదేశం 28 US ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. ఇప్పుడు ఈ అదనపు దిగుమతి సుంకాన్ని తొలగించాలని భారతదేశం నిర్ణయించిన తర్వాత ఈ 8 అమెరికన్ ఉత్పత్తులకు ప్రస్తుతం మోస్ట్ ఫేవర్డ్ కంట్రీ (MFN) రేటు ఆధారంగా మాత్రమే దేశంలో ఛార్జీ విధించబడుతుంది.
Read Also: India vs China: స్మార్ట్ ఫోన్లే కాదు.. తయారీ విషయంలో చైనాను అధిగమిస్తున్న భారత్..!
వచ్చే 90 రోజుల్లో అమెరికా ఉత్పత్తులపై ఈ సుంకాలను క్రమంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు భారత్లో అమెరికన్ పప్పుపై 10 శాతం నుంచి 20 శాతం, పొడి బాదంపప్పుపై కిలోకు రూ.7, ఒలిచిన బాదంపప్పుపై కిలోకు రూ.20, వాల్నట్లపై 20 శాతం, యాపిల్స్పై 20 శాతం, బోరిక్ యాసిడ్పై 20 శాతం మరియు డయాగ్నొస్టిక్ రియాజెంట్లపై 20 శాతం అదనపు సుంకం తీసివేయబడుతుంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండనుంది. గత ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వస్తు వ్యాపారం $128.8 బిలియన్లకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 119.5 బిలియన్ డాలర్లు. అయితే యాపిల్స్ ను ఎగుమతి చేసుకోవడంలో వాషింగ్టన్ తర్వాత భారతదేశం ఉంది.
తాజావార్తలు
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!