యూకే నుంచి వచ్చేవారిపై భారత్ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్ 4వ తేదీ నుంచి అంటే ఈ నెల 4 నుంచి.. యూకే నుంచి భారత్కు వచ్చే పౌరులపై ఆంక్షలు పెట్టింది.. భారత్కు రావాలంటే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.. అంతేకాదు.. భారత్లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన భారత్.. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.. అంతేకాదు ఇక్కడ అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని.. భారత్లో అడుగుపెట్టిన తర్వాత ఇంట్లో కానీ, మరో ప్రాంతంలో గానీ పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
Also Read
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!