Pakistan: ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకోవాలి.. నిరాకరించడంతో సునీతపై కమ్రాన్ యాసిడ్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid attack on minority girl in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ, క్రిష్టియన్ యువతులను బలవంతంగా అపహరించి, మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలనే కాదు, పెళ్లై బిడ్డలు ఉన్న మహిళలను కూడా అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సుల్లో ఈ రకమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఉదంతం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మైనారిటీ యువతిపై యాసిడ్ దాడి జరిగింది.
Read Also: Pakistan: మీరు టర్కీ రావాల్సిన అవసరం లేదు.. పాక్ ప్రధానికి ఘోర అవమానం..
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
కరాచీ నగరంలో నివాసం ఉంటున్న క్రైస్తవ యువతి సునీత మహీమ్ అనే 19 ఏళ్ల యువతిపై కమ్రాన్ అల్లా బక్ష్ అనే ముస్లిం యువకుడు యాసిడ్ తో దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఫిబ్రవరి 1న కరాచీలోని ఫ్రీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సునీత మసీమ్ స్థానిక మసూమ్ షా కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటోంది. కమ్రాన్ ఆమె ఇంటి పొరుగునే ఉంటున్నాడు. ఫిబ్రవరి 1న వేరే పనిపై సునీత కరాచీలోని కాలాపుల్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో కంటోన్మెంట్ ఏరియాలో బస్ ఎక్కే సమయంలో సునీతపై కమ్రాన్ యాసిడ్ తో దాడి చేశాడు.
దాడి అనంతర అక్కడి నుంచి కమ్రాన్ పరారయ్యాడు. ఈ దాడిలో సునీత శరీరం 20 శాతం కాలింది. ముఖం, కాళ్లు, కళ్లపై తీవ్రగాయాలు అయ్యాయి. గత కొంత కాలంగా క్రిస్టియానిటీని వదిలి ఇస్లాంలోకి మారాలని కమ్రాన్, సునీతపై ఒత్తడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సునీత కుటుంబ సభ్యులు, కమ్రాన్ కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అయితే తాను క్రిష్టియానిటీని వదిలిపెట్టనని.. పెళ్లి చేసుకోనని చెప్పడంతో నిందితుడు యువతిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సునీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!