Pakistan: ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకోవాలి.. నిరాకరించడంతో సునీతపై కమ్రాన్ యాసిడ్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid attack on minority girl in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ, క్రిష్టియన్ యువతులను బలవంతంగా అపహరించి, మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలనే కాదు, పెళ్లై బిడ్డలు ఉన్న మహిళలను కూడా అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సుల్లో ఈ రకమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఉదంతం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మైనారిటీ యువతిపై యాసిడ్ దాడి జరిగింది.
Read Also: Pakistan: మీరు టర్కీ రావాల్సిన అవసరం లేదు.. పాక్ ప్రధానికి ఘోర అవమానం..
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
కరాచీ నగరంలో నివాసం ఉంటున్న క్రైస్తవ యువతి సునీత మహీమ్ అనే 19 ఏళ్ల యువతిపై కమ్రాన్ అల్లా బక్ష్ అనే ముస్లిం యువకుడు యాసిడ్ తో దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఫిబ్రవరి 1న కరాచీలోని ఫ్రీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సునీత మసీమ్ స్థానిక మసూమ్ షా కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటోంది. కమ్రాన్ ఆమె ఇంటి పొరుగునే ఉంటున్నాడు. ఫిబ్రవరి 1న వేరే పనిపై సునీత కరాచీలోని కాలాపుల్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో కంటోన్మెంట్ ఏరియాలో బస్ ఎక్కే సమయంలో సునీతపై కమ్రాన్ యాసిడ్ తో దాడి చేశాడు.
దాడి అనంతర అక్కడి నుంచి కమ్రాన్ పరారయ్యాడు. ఈ దాడిలో సునీత శరీరం 20 శాతం కాలింది. ముఖం, కాళ్లు, కళ్లపై తీవ్రగాయాలు అయ్యాయి. గత కొంత కాలంగా క్రిస్టియానిటీని వదిలి ఇస్లాంలోకి మారాలని కమ్రాన్, సునీతపై ఒత్తడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సునీత కుటుంబ సభ్యులు, కమ్రాన్ కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అయితే తాను క్రిష్టియానిటీని వదిలిపెట్టనని.. పెళ్లి చేసుకోనని చెప్పడంతో నిందితుడు యువతిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సునీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..