China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Covid: కరోనా కారణంగా చైనా అతలాకుతలం అవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ వేలల్లో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి అక్కడ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రిటన్కు చెందిన డాటా రీసెర్చ్ సంస్థ ఎయిర్ఫినిటీ కొన్ని సంచలన విషయాల్ని రివీల్ చేసింది. డ్రాగన్ కంట్రీలో రోజుకు సుమారు 9 వేల మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నారని తన నివేదికలో పేర్కొంది. చైనా ప్రభుత్వం వాస్తవ గణాంకాల్ని బయటకు చెప్పకపోవడం, మీడియా కూడా మౌనం పాటిస్తుండటంతో.. ఈ ఎయిర్ఫినిటీ సంస్థ అక్కడి కరోనా పరిస్థితిని రికార్డ్ చేస్తూ, తాజాగా ఈ నివేదికను బయటపెట్టింది. అక్కడ అంచనాలకు మించి రెట్టింపు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.
Gas Cylinder Price: న్యూ ఇయర్ వేళ బాంబ్ పేల్చిన కేంద్రం.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేయకముందే.. వివిధ ప్రావిన్స్ల నుంచి కరోనా తీవ్రతను రికార్డ్ చేస్తున్నామని, ఆ అందిన సమాచారం మేరకు ఈ గణాంకాలు వెల్లడించినట్టు ఎయిర్ఫినిటీ సంస్థ పేర్కొంటోంది. ఇతర దేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేశాక నమోదైన కేసుల వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుని.. చైనా పరిస్థితులపై ఈ సంస్థ ఓ నమూనా రూపొందించింది. ఒక్క డిసెంబరు నెలలోనే చైనాలో లక్షకు పైగా మరణాలు సంభవించాయని ఆ నివేదికలో పేర్కొంది. కేసుల సంఖ్య 18.6 మిలియన్లు దాటిందని.. జనవరి 23 కల్లా చైనాలో గరిష్ఠంగా రోజుకు 3.7 మిలియన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక రోజువారి మరణాల సంఖ్య 25 వేలకు ఎగబాకొచ్చని అంచనా వేసింది. జనవరి 23 నాటికి చైనాలో 5.84 లక్షల మరణాలు సంభవించొచ్చని పేర్కొంది. అయితే.. చైనా మాత్రం డిసెంబర్ 30వ తేదీన తమ దేశంలో కేవలం ఒక్కరు మాత్రమే కొవిడ్తో మరణించినట్టు ప్రకటించడం గమనార్హం.
NTR30: అఫీషియల్ – తారక్ ఫ్యాన్స్కి ఒకటి గుడ్.. మరొకటి బ్యాడ్ న్యూస్
చైనా అధికారిక లెక్కల ప్రకారం.. 2020 నుంచి ఇప్పటివరకూ కేవలం 5247 కరోనా మరణాలే సంభవించాయి. తమ దేశ ప్రతిష్ట దెబ్బతినకూడదనే చైనా ఇలా తప్పుడు సమాచారం అందిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మరణాలను చైనా ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అందుకే.. వాస్తవిక గణాంకాలను వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనా ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించాలని సూచించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!