Uganda: స్కూల్పై టెర్రరిస్టుల దాడి.. 37 మంది విద్యార్థుల ఊచకోత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న మిలిటెంట్లు దారుణానికి తెగబడ్డారు. 37 మంది విద్యార్థులను అత్యంత దారుణంగా నరికి కాల్చి చంపారు. ఇది ఈ దశాబ్ధంలోనే అత్యంత దారుణమైన సంఘటన అని ఉగాండా అధికార వర్గాలు పేర్కొన్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలోని కాసేస్ జిల్లాలోని మ్పాండ్వేలోని సెకండరీ స్కూల్పై శుక్రవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
విద్యార్థులు ఉండే హాస్టళ్లను తగలబెట్టారు. విద్యార్థులను కత్తులతో నరికివేశారని అధికారులు తెలిపారు. మరణించిన 37 మంది విద్యార్థులు మృతదేహాలను బ్వేరాలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారని.. ఆరుగురిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్ చేసిన వారిని కాంగో సరిహద్దుల్లో ఉన్న విరుంగా నేషనల్ పార్క్ వైపు తీసుకెళ్తున్నారని, విద్యార్థులను రక్షించేందుకు భద్రతా సిబ్బంది వెంబడించడం ప్రారంభించిందని ఉగాండా ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
Read Also: Adipurush: ఆదిపురుష్పై ఆప్ వర్సెస్ బీజేపీ.. మనోభావాలు దెబ్బతీశారని ఆరోపణ.
సోమాలియాకు చెందిన అల్-షబాబ్ గ్రూప్ 2010లో కంపాలాలో జంట పేలుళ్లకు పాల్పడింది. ఆ సమయంలో 76 మంది మరణించారు. ఆ తరువాత ఇప్పుడే అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. దాడి జరిగిన సరిహద్దు కాంగో దేశానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఏడీఎఫ్ మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉన్నారు. 1990 నుంచి వేలాది మందిని వీరు చంపారు. మిలిటెంట్లు ముందుగా బాలుర వసతి గృహానికి తాళం వేసి నిప్పటించారు. కాగా, బాలిక వసతి గృహానికి తాళం వేయలేదు, తమను తాము రక్షించుకునేందుకు పరిగెత్తుతున్న సమయంలో వారిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంత తీవ్రంగా కాలిపోయాయని, డీఎన్ఏ పరీక్ష చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు.
ఉగాండాలోని పాఠశాలపై ADF దాడి చేయడం ఇది మొదటిది కాదు. జూన్ 1998లో కాంగో సరిహద్దు సమీపంలోని కిచ్వాంబా టెక్నికల్ ఇన్స్టిట్యూట్పై ఏడీఎఫ్ మిలిటెంట్లు చేసిన దాడిలో 80 మంది విద్యార్థులు వారి వసతి గృహాలలో కాలిపోయారు. 100 మందికి పైగా విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాండా, కాంగో 2021లో ఏడీఎఫ్ ను తరిమికొట్టేందుకు ఉమ్మడిగా దాడులు చేస్తున్నాయి. అయితే చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!