Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న మిలిటెంట్లు దారుణానికి తెగబడ్డారు. 37 మంది విద్యార్థులను అత్యంత దారుణంగా నరికి కాల్చి చంపారు. ఇది ఈ దశాబ్ధంలోనే అత్యంత దారుణమైన సంఘటన అని ఉగాండా అధికార వర్గాలు పేర్కొన్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలోని కాసేస్ జిల్లాలోని మ్పాండ్వేలోని సెకండరీ స్కూల్పై శుక్రవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.