Turkey Earthquake: సందట్లో సడేమియా.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 ISIS Terrorists Escape After Earthquake: టర్కీ, సిరియా ప్రాంతాల్లో వరస భూకంకపాల వల్ల తీవ్ర ప్రభావితం అయ్యాయి. వేలాదిగా ప్రజలు మరణించారు. ముఖ్యంగా 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలు వణికిపోయాయి. పలు బిల్డింగులు మేకమేడల్లా కూలిపోయాయి. వరసగా 100కు పైగా ప్రకంపన ధాటికి ఈ రెండు దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ భూకంపం ఉగ్రవాదులకు వరంగా మారింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఉగ్రవాదులు తప్పించుకునిపోయారు. సిరియాలో కరుడుగట్టిన 20 మంది ఐఎసఐఎస్ ఉగ్రవాదులు జైలు నుంచి పరారయ్యారు.
Read Also: Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం
Also Read
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
భూకంపం తరువాత సోమవారం వాయువ్య సిరియా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేశారు. కనీసం 20 మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ టెర్రరిస్టులు జైలు నుండి తప్పించుకున్నారు. టర్కీ సరిహద్దుల్లో ఉన్న రాజో పట్టనంలోని సైనిక పోలీస్ జైలులో 2,000 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 1300 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి. ఈ జైలులో కుర్దిష్ దళాలకు సంబంధించిన ఖైదీలు కూడా ఉన్నారు. 7.8 మాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపం కారణంగా జైలు గోడలు, తలుపులు బద్ధలయ్యాయి. ఇదే సమయంలో జైలులో ఖైదీలు పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. ప్రాథమికంగా 20 మంది తప్పించుకున్నారని అనుకుంటున్నప్పటికీ.. మరింత సమాచారం రావాల్సి ఉంది.
గత డిసెంబర్ లో రాజోలోని తోటి ఉగ్రవాదులను విడిపించేందుకు సిరియా రాజధాని రఖాలోని ఓ భద్రతా సముదాయంపై దాడి జరిగింది. 2011లో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఖలీఫా రాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని ముస్లిం యువతను ఆకర్షించింది. సిరియాలో జరిగిన ఉగ్రవాద సంఘర్షణల్లో ఇప్పటికే 5 లక్షల మంది మరణించారు. సిరియాలో అంతర్యుద్ధాన్ని తట్టుకోలేక ఆ దేశ ప్రజలు యూరప్, టర్కీలకు వలసవెళ్లారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!