Pakistani Nationals Arrested: అమెరికాలో నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు .. ఇద్దరు పాకిస్తానీయుల అరెస్టు
- అమెరికాలో నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు..
- ఇద్దరు పాకిస్తానీయులను అరెస్ట్ చేసిన ఎఫ్బీఐ..
- నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వివరించారు.
Read Also: Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
అయితే, టెక్సాస్లోని పాకిస్తాన్కు చెందిన అబ్దుల్ హాది, ముర్షిద్, మహమ్మద్ సల్మాన్లను ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నకిలీ ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి అక్రమంగా వీసాలు పొంది.. వాటిని విదేశీయులకు భారీ మొత్తంలో విక్రయించారు.. ఇందుకు ఈబీ-2, ఈబీ-3, హెచ్1బీ వీసా ప్రోగ్రామ్లను ఉపయోగించినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు.. లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు నకిలీ ఉద్యోగ ప్రకటనలను న్యూస్ పేపర్లలో ప్రచురించారు.. ఒక్కసారి అక్కడి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత.. వారు వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్ కార్డులను మంజూరు చేయాలని యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని కోరినట్లు పేర్కొన్నారు.
Read Also: Penukonda: సైకిల్ తొక్కి ‘సైకిల్ యాత్ర’ను ప్రారంభించిన మంత్రి సవిత..!
ఇక, పాకిస్తానీయుల గుట్టు కాస్త బయట పడటంతో ఎఫ్బీఐ అధికారులకు పట్టుబడ్డారు. విచారణలో ముర్షిద్ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు ట్రై చేసినట్లు తేలింది. వీరు కొన్ని ఏళ్ల నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎఫ్బీఐ డల్లాస్ స్పెషల్ ఏజెంట్ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడటానికి, ఇమిగ్రేషన్కు బలమైన చట్టాలు అవసరమని అతడు నొక్కి చెప్పుకొచ్చారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై ఈ నెల 30వ తేదీన తదుపరి విచారణ జరగబోతుంది. వీరు దోషులుగా తేలితే.. సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!