Pakistani Nationals Arrested: అమెరికాలో నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు .. ఇద్దరు పాకిస్తానీయుల అరెస్టు
- అమెరికాలో నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు..
- ఇద్దరు పాకిస్తానీయులను అరెస్ట్ చేసిన ఎఫ్బీఐ..
- నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వివరించారు.
Read Also: Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
అయితే, టెక్సాస్లోని పాకిస్తాన్కు చెందిన అబ్దుల్ హాది, ముర్షిద్, మహమ్మద్ సల్మాన్లను ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నకిలీ ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి అక్రమంగా వీసాలు పొంది.. వాటిని విదేశీయులకు భారీ మొత్తంలో విక్రయించారు.. ఇందుకు ఈబీ-2, ఈబీ-3, హెచ్1బీ వీసా ప్రోగ్రామ్లను ఉపయోగించినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు.. లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు నకిలీ ఉద్యోగ ప్రకటనలను న్యూస్ పేపర్లలో ప్రచురించారు.. ఒక్కసారి అక్కడి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత.. వారు వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్ కార్డులను మంజూరు చేయాలని యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని కోరినట్లు పేర్కొన్నారు.
Read Also: Penukonda: సైకిల్ తొక్కి ‘సైకిల్ యాత్ర’ను ప్రారంభించిన మంత్రి సవిత..!
ఇక, పాకిస్తానీయుల గుట్టు కాస్త బయట పడటంతో ఎఫ్బీఐ అధికారులకు పట్టుబడ్డారు. విచారణలో ముర్షిద్ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు ట్రై చేసినట్లు తేలింది. వీరు కొన్ని ఏళ్ల నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎఫ్బీఐ డల్లాస్ స్పెషల్ ఏజెంట్ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడటానికి, ఇమిగ్రేషన్కు బలమైన చట్టాలు అవసరమని అతడు నొక్కి చెప్పుకొచ్చారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై ఈ నెల 30వ తేదీన తదుపరి విచారణ జరగబోతుంది. వీరు దోషులుగా తేలితే.. సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.
తాజావార్తలు
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
-
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!