Dubai: దుబాయ్లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
- దుబాయ్లో విషాదం
- 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Artificial Rain: ఢిల్లీలో మేఘ మథనం.. ప్రయోగం విజయవంతం
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
వైష్ణవ్ కృష్ణకుమార్.. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో బీబీఏ మార్కెటింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గోల్డెన్ వీసా కలిగి ఉన్నాడు. మంగళవారం దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా వైష్ణవ్ కృష్ణకుమార్ కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. గుండెపోటు కారణంగా మరణించాడని వైద్యులు ప్రకటించారు. అయితే గుండెపోటు వార్తలను కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తమ కుమారుడికి గుండెపోటు సమస్యలు లేవని వాపోయారు. దీంతో దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు బీహార్లో మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం కేరళకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు దుబాయ్ అధికారులను కోరారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కాగానే మృతదేహం శుక్రవారం కేరళకు చేరే అవకాశం ఉందని వైష్ణవ్ కుమార్ మామ, దుబాయ్ నివాసి నితీష్ ఖలీజ్ తెలిపాడు. వైష్ణవ్ కుమార్కు అసలేం జరిగిందో అర్థం కావడం లేదన్నారు. దీనిపై స్పష్టమైన వివరాలు తెలియాలని కోరారు.
వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 సంవత్సరాలకు పైగా దుబాయ్లో పనిచేస్తున్నారు. వైష్ణవ్, అతని చెల్లెలు దుబాయ్లోనే పుట్టి పెరిగారు. దుబాయ్లో స్నేహితులు చాలా మంది ఉన్నారని.. తెలివైన అబ్బాయి అని బంధువు తెలిపారు. రెండేళ్ల క్రితం కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కోసం కేరళ వచ్చారని చెప్పారు. వైష్ణవ్ అంత్యక్రియలు కేరళలోని ఇంటి ఆవరణలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!