Artificial Rain: ఢిల్లీలో మేఘ మథనం.. ప్రయోగం విజయవంతం
- ఢిల్లీలో మేఘ మథనం
- ప్రయోగం విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి రేఖా గుప్తా ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా తొలిసారి కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేసింది. బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం చేసిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో అక్టోబర్ 29న మొదటి క్లౌడ్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Trump-Israel: అలా చేస్తే మా మద్దతు కోల్పోతారు.. ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం ట్రయల్ రన్ జరిగింది. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్లను విమానం నుంచి కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో గాలిలో తేమ పరిమితంగా ఉందని.. 20 శాతం కంటే తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Minister Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ..
కృత్రిమ వర్షానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం ఎక్స్లో పేర్కొన్నారు. బురారీ ప్రాంతంలో ట్రయల్ రన్ విజయవంతంగా జరిగిందని తెలిపారు. ‘‘ఢిల్లీలో తొలిసారిగా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది రాజధాని వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన సాంకేతిక మైలురాయిని సూచిస్తుంది. గురువారం నిపుణులు బురారి ప్రాంతంలో ట్రయల్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించారు.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.
‘‘వాతావరణ శాఖ ప్రకారం.. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మేఘావృతమైన పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే అక్టోబర్ 29న ఢిల్లీలో మొదటి కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది.’’ అని ఆమె పోస్ట్లో పేర్కొన్నారు.
‘‘ఈ చొరవ సాంకేతికంగా చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు. ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక శాస్త్రీయ విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఆవిష్కరణ ద్వారా రాజధాని గాలిని శుభ్రపరచడం, పర్యావరణాన్ని సమతుల్యం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.’’ అని రేఖా గుప్తా అన్నారు.
ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.3.21 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఢిల్లీ మంత్రివర్గం మే 7న ఆమోదించింది. ఈ ప్రాజెక్టును పూణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), భారత వాతావరణ శాఖ (IMD) నిపుణుల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల కారణంగా కొంత ఆలస్యం జరుగుతోంది. మొత్తానికి ఈ నెలలో అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలకు అక్టోబర్ 1-నవంబర్ 30 మధ్య అనుమతి ఉంది.
दिल्ली में पहली बार क्लाउड सीडिंग के माध्यम से कृत्रिम वर्षा कराने की तैयारियां पूरी कर ली गई हैं। आज विशेषज्ञों द्वारा बुराड़ी क्षेत्र में इसका सफल परीक्षण किया गया है।
मौसम विभाग ने 28, 29 और 30 अक्टूबर को बादलों की उपस्थिति की संभावना जताई है। यदि परिस्थितियां अनुकूल रहीं, तो…
— Rekha Gupta (@gupta_rekha) October 23, 2025
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!