Artificial Rain: ఢిల్లీలో మేఘ మథనం.. ప్రయోగం విజయవంతం
- ఢిల్లీలో మేఘ మథనం
- ప్రయోగం విజయవంతం
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి రేఖా గుప్తా ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా తొలిసారి కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేసింది. బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం చేసిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో అక్టోబర్ 29న మొదటి క్లౌడ్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Trump-Israel: అలా చేస్తే మా మద్దతు కోల్పోతారు.. ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్
Also Read
- Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
- PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం ట్రయల్ రన్ జరిగింది. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్లను విమానం నుంచి కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో గాలిలో తేమ పరిమితంగా ఉందని.. 20 శాతం కంటే తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Minister Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ..
కృత్రిమ వర్షానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం ఎక్స్లో పేర్కొన్నారు. బురారీ ప్రాంతంలో ట్రయల్ రన్ విజయవంతంగా జరిగిందని తెలిపారు. ‘‘ఢిల్లీలో తొలిసారిగా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది రాజధాని వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన సాంకేతిక మైలురాయిని సూచిస్తుంది. గురువారం నిపుణులు బురారి ప్రాంతంలో ట్రయల్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించారు.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.
‘‘వాతావరణ శాఖ ప్రకారం.. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మేఘావృతమైన పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే అక్టోబర్ 29న ఢిల్లీలో మొదటి కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది.’’ అని ఆమె పోస్ట్లో పేర్కొన్నారు.
‘‘ఈ చొరవ సాంకేతికంగా చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు. ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక శాస్త్రీయ విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఆవిష్కరణ ద్వారా రాజధాని గాలిని శుభ్రపరచడం, పర్యావరణాన్ని సమతుల్యం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.’’ అని రేఖా గుప్తా అన్నారు.
ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.3.21 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఢిల్లీ మంత్రివర్గం మే 7న ఆమోదించింది. ఈ ప్రాజెక్టును పూణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), భారత వాతావరణ శాఖ (IMD) నిపుణుల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల కారణంగా కొంత ఆలస్యం జరుగుతోంది. మొత్తానికి ఈ నెలలో అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలకు అక్టోబర్ 1-నవంబర్ 30 మధ్య అనుమతి ఉంది.
दिल्ली में पहली बार क्लाउड सीडिंग के माध्यम से कृत्रिम वर्षा कराने की तैयारियां पूरी कर ली गई हैं। आज विशेषज्ञों द्वारा बुराड़ी क्षेत्र में इसका सफल परीक्षण किया गया है।
मौसम विभाग ने 28, 29 और 30 अक्टूबर को बादलों की उपस्थिति की संभावना जताई है। यदि परिस्थितियां अनुकूल रहीं, तो…
— Rekha Gupta (@gupta_rekha) October 23, 2025
తాజావార్తలు
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
-
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
-
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!