Pakistan: క్వెట్టా బ్లాస్ట్.. 14 మంది సైనికులతో సహా 26 మంది మృతి.. “బీఎల్ఏ” బాధ్యత..
- పాకిస్తాన్ క్వెట్టా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు..
- 14 మంది పాక్ ఆర్మీ సైనికులతో సహా 26 మంది మృతి..
- బాధ్యత ప్రకటించుకున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో శనివారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని రైల్వే స్టేషన్లో బాంబు పేలి 26 మంది మరణించారు. పాకిస్తాన్ ఆర్మీ సైనికులే లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన 26 మందిలో 14 మంది సైనికులు ఉన్నారు. క్వెట్టా స్టేషన్ నుంచి పెషావర్కి ఈ రోజు ఉదయం రైలు బయలుదేరే ముందు ఈ పేలుడు సంభవించింది. పేలుకు సంబంధించిన వీడియోలో, ఫోటోలు వైరల్గా మారాయి.
Read Also: Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
Also Read
అయితే, ఈ పేలుడు తమ పనే అని ‘‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)’’ ప్రకటించింది. పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు చెప్పింది. క్వెట్టా రైల్వే స్టేషన్లోని పాకిస్తాన్ ఆర్మీ యూనిట్పై దాడి చేసినట్లు ఒక ప్రకటనలో బీఎల్ఏ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఇటీవల కాలంలో ఈ సంస్థ పాక్ ఆర్మీతో పాటు, చైనీయులు లక్ష్యంగా దాడులు చేస్తోంది.
ముఖ్యంగా బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సుని కలుపుతూ సిపెక్ ప్రాజెక్ట్ చేపడుతోంది చైనా. ఈ ప్రాజెక్టులో పనిచేస్తే చైనీయులతో పాటు దానికి రక్షణగా నిలుస్తున్న పాక్ ఆర్మీ, పోలీసులపై బీఎల్ఏ విరుచుకుపడుతోంది. తమ బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు చైనా సహజ వనరుల్ని కొల్లగొడుతోందని బీఎల్ఏ ప్రధాన ఆరోపణ.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!