Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
- ఘోర విమాన ప్రమాదం
- 10 మంది దుర్మరణం
- బహమాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bahamas Plane Crash: బహమాస్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బహమాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించడంతో ఆనందోత్సవాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారాయి.
ఫ్లెమింగో ఎయిర్లైన్స్కు చెందిన సెస్నా 402 విమానం
ప్రమాదానికి గురైన విమానం ఫ్లెమింగో ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న సెస్నా 402. ఈ విమానం నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్కు బయలుదేరింది. అయితే ప్రయాణం మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
ల్యాండింగ్ అనంతరం మంటలు.. భారీ పేలుడు
అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం భారీ పేలుడు సంభవించడంతో విమానంలో ఉన్న వారంతా మృతి చెందినట్లు వెల్లడించారు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఒక వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీసినప్పటికీ చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
బ్లాక్ బాక్స్ స్వాధీనం.. దర్యాప్తు ప్రారంభం
ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు విమానం బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నాయి. దాని విశ్లేషణ అనంతరం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
ఈ ఘటన అనంతరం ఫ్లెమింగో ఎయిర్లైన్స్ తమ అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సంస్థ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఆదేశించింది.
ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ సంతాపం
ప్రమాదంపై బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వేడుకలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం అందించిన అనంతరం వారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని బహమాస్ ప్రభుత్వం తెలిపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తైన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!