Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
- ఘోర విమాన ప్రమాదం
- 10 మంది దుర్మరణం
- బహమాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bahamas Plane Crash: బహమాస్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బహమాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించడంతో ఆనందోత్సవాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారాయి.
ఫ్లెమింగో ఎయిర్లైన్స్కు చెందిన సెస్నా 402 విమానం
ప్రమాదానికి గురైన విమానం ఫ్లెమింగో ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న సెస్నా 402. ఈ విమానం నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్కు బయలుదేరింది. అయితే ప్రయాణం మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
- Bangladesh: బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
ల్యాండింగ్ అనంతరం మంటలు.. భారీ పేలుడు
అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం భారీ పేలుడు సంభవించడంతో విమానంలో ఉన్న వారంతా మృతి చెందినట్లు వెల్లడించారు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఒక వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీసినప్పటికీ చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
బ్లాక్ బాక్స్ స్వాధీనం.. దర్యాప్తు ప్రారంభం
ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు విమానం బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నాయి. దాని విశ్లేషణ అనంతరం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
ఈ ఘటన అనంతరం ఫ్లెమింగో ఎయిర్లైన్స్ తమ అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సంస్థ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఆదేశించింది.
ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ సంతాపం
ప్రమాదంపై బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వేడుకలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం అందించిన అనంతరం వారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని బహమాస్ ప్రభుత్వం తెలిపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తైన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!