Pakistan: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి..
- పాకిస్తాన్పై మరోసారి ఉగ్రదాడి..
- పోలీసులపై పాక్ తాలిబాన్ల దాడి..
- 10 మంది వరకు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్పై మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది పోలీసులు చనిపోయినట్లు సంబంధిత వర్గాలు వెళ్లడించాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్’ గ్రూప్ ప్రకటించింది. గురువారం ఈ దాడి జరిగింది. సీనియర్ పోలీస్ అధికారులు దాడిని ధ్రువీకరించారు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు అవుట్పోస్ట్లోకి చొరబడి బోర్డర్ కాస్టబులరీ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుల్ని చంపారు.
Read Also: Maldives: భారత్ దెబ్బతో మల్దీవులు కుదేలు.. అధ్యక్షుడి జీతం దానం.. ఉద్యోగుల శాలరీల్లో కోత!
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
సీనియర్ తాలిబాన్ నాయకుడు ఉస్తాద్ ఖురేషీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు పాక్ తాలిబాన్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని బజౌర్ జిల్లాలో, ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారంతో పాక్ ఆర్మీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఖురేషీతో పాటు తొమ్మిది మంది మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాదంతో, దక్షిణాన బలూచిస్తాన్లో వేర్పాటువాదంతో పాకిస్తాన్ పోరాడుతోంది. వాయువ్యంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాకిస్తాన్ తాలిబాన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తరుచుగా వీరు పాక్ ఆర్మీ, పోలీసులు టార్గెట్గా దాడులు చేస్తున్నారు. మరోవైపు బలూచిస్తాన్కి స్వాతంత్య్రం కావాలని ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాకిస్తాన్ భద్రతా బలగాలు టార్గెట్గా దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!