Ponguleti Srinivas Reddy: నా పరిపాలనలో మాటలు ఉండవు.. కను సైగలే.. అధికారులకు మంత్రి హెచ్చరిక
ఖమ్మం: పాలేరు అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శనివారం పాలేరులోని కుసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘అధికారులు నా జ్ఞానేంద్రియాలు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం జరగదు. అలాగే అధికారులు కూడా ఎటువంటి రూపాయి ఆశించకుండా ప్రజల పనులు నెరవేర్చాలి. ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం జరగదు వారి పద్ధతి మార్చుకొని విధులు నిర్వహించాలి.
అలా జరగకపోతే వారి అంతట వారే వెళ్లే విధంగా కనుసైగల తోటే జరుపుతా. నా పరిపాలనలో మాటలు ఉండవు కను సైగలు మాత్రమే. ఎన్ని శక్తులు ఎదురైన, ఎన్ని కుట్రలు పన్నినా మీ అందరి దీవెనలతో గెలిచాను. ఎన్నికల సమయంలో అనేక గ్రామాల్లో ఇచ్చిన వాగ్దానాలు త్వరలోనే పూర్తి చేస్తా. అనేక మంది ధరణితో ఇబ్బందులు పడుతున్నారు. నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా. ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు తీసుకొని వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను నెరవేర్చుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో మంత్రుల అద్వర్యం లో ప్రతి గ్యారెంటీ అమలు చేస్తాం. గతంలో కొంతమంది అనేక కేసులు పెట్టారు.వాటన్నింటినీ పరిష్కరిస్తాను. ఆరు గ్యారెంటీ లను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పాము.
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
రెండు మూడు రోజుల్లో తీపి వార్త వింటారు. ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల కోట్ల అప్పులు చేసింది గత ప్రభుత్వం. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం81 వేల కోట్ల అప్పులు చేసి ఒప్పచెప్పింది. ఎన్ని అప్పులు మా నెత్తిన పెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గతంలో ఆగి పోయిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించాం. ఏ ఒక్క అధికారికి డబ్బులు తీసుకుని పోస్టింగ్ లు ఇవ్వం. ప్రజల నుంచి అధికారులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేయాలి. నన్ను నమ్ముకున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోను. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు కలిసి పనిచేయాలి. ఎన్నికల వరకే రాజకీయాలు, మేము కానీ మా పార్టీ నాయకులు కక్ష పూరిత చర్యలకు పాల్పడం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!