Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1971.. భారత రక్షణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. బంగాళాఖాతంలో పాక్ ఉనికి పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత సీన్ మారుతోంది. బంగాళాఖాతంలో మళ్లీ పాగా వేయడానికి దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. దీనికోసం చైనా సాయంతో ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తన సరికొత్త హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అసలు పాకిస్థాన్ వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్తో పెరుగుతున్న స్నేహం భారత్కు ఎలాంటి సవాళ్లు విసరబోతోంది? బంగాళాఖాతంలో ఆధిపత్యం కోసం ఏ దేశం ఎలా గేమ్ ఆడుతోంది.
హంగోర్ చరిత్ర ఏంటి?
హంగోర్.. ఈ పేరు వింటేనే చరిత్ర గుర్తుకొస్తుంది. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో.. పాక్కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ సబ్ మెరైన్.. భారత నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచేసింది. ఆ దాడిలో కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాతో పాటు 176 మంది భారతీయ నావికులు వీరమరణం పొందారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యుద్ధ సమయంలో భారత నౌక మునిగిపోవడం అదే తొలిసారి. అయితే ఆ తర్వాత జరిగిన యుద్ధంలో భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించాయి. బంగ్లాదేశ్కు విముక్తి కలిగించాయి. ఆ దెబ్బతో బంగాళాఖాతంలో పాక్ ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరుతో పాకిస్థాన్ పన్నాగం పన్నుతోంది. చైనాలో తయారైన సరికొత్త తొలి హంగోర్ క్లాస్ సబ్ మెరైన్.. ఏప్రిల్ లో కమిషన్ అయి.. ఇటీవలే కరాచీ చేరుకుంది. అరేబియా సముద్రాన్ని దాటి.. బంగాళాఖాతంలో తమ ఉనికిని చాటుకుంటామని పాక్ నావికాదళ అధికారులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
Also Read
- Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
- Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
- Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్
- Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లు..ది గేమ్ ఛేంజర్:
1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ నావికాదళం కేవలం ఉత్తర అరేబియా సముద్రానికే పరిమితం అయింది. బంగాళాఖాతం భౌగోళికంగా వ్యూహాత్మకంగా భారత్కు ఒక బలమైన కంచుకోట. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం… అండమాన్ నికోబార్ దీవులు భారత్కు ఇక్కడ తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తున్నాయి. అయితే ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్ కమోడోర్ ఒమర్ ఫరూఖ్.. తమ కొత్త సబ్ మెరైన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల రాకతో.. బంగాళాఖాతంలోకి ప్రవేశించే సామర్థ్యం పాకిస్థాన్కు వస్తుందని ఆయన చెప్పారు. ఇదొక గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు.
ఇలాంటివి మొత్తం 8 సబ్ మెరైన్లను పాక్ సిద్ధం చేస్తోంది. పాత అగోస్టా సబ్ మెరైన్ల స్థానంలో వీటిని తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు ఆయా దేశాల ప్రాదేశిక జలాలు ఉంటాయి. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఏ దేశ యుద్ధనౌకలైనా తిరగవచ్చు. ఇదే లూప్ హోల్ ను వాడుకుని బంగాళాఖాతంలో పాగా వేయాలని పాక్ చూస్తోంది.
బంగాళాఖాతంలో పాక్ ఇంత ధైర్యంగా వ్యూహాలు రచించడానికి బంగ్లాదేశ్లో మారిన రాజకీయ ముఖచిత్రమే కారణం. ఇండో-పసిఫిక్ రీజియన్లో ఈ సముద్ర మార్గం వాణిజ్యపరంగా చాలా కీలకం. దశాబ్దాలుగా బంగ్లాదేశ్కు…పాకిస్థాన్కు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కానీ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య స్నేహం బలపడింది. ఢాకా.. కరాచీ మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలయ్యాయి.
బంగ్లాదేశ్ విమానాలు భారత గగనతలాన్ని వాడుకుంటూనే పాక్కు వెళ్తున్నాయి. ఢాకా వర్సిటీలో ఉర్దూ షాయరీలు.. రాహత్ ఫతే అలీ ఖాన్ కచేరీలు జరుగుతున్నాయి. వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నాటికి ఇరు దేశాల వాణిజ్యం 20 శాతం పెరిగింది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఒప్పందాల దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇక సైనిక సహకారం కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్థాన్ లో పర్యటించి.. జేఎఫ్-17 ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఆసక్తి చూపించారు. ఆ తర్వాత అమాన్-25 నావికాదళ విన్యాసాల్లో ఇరు దేశాలు పాల్గొన్నాయి.
బంగ్లాదేశ్తో పెరుగుతున్న ఈ స్నేహం.. తూర్పు హిందూ మహాసముద్రంలో పాక్ నావికాదళ కార్యకలాపాలు పెరిగేలా చేస్తోంది. గతేడాది నవంబర్ లో పాక్ యుద్ధనౌక పీఎన్ఎస్ సైఫ్.. నాలుగు రోజుల పాటు చట్టోగ్రామ్ పోర్టులో బస చేసింది. 1971 తర్వాత పాక్ యుద్ధనౌక బంగ్లాదేశ్ కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇంటెలిజెన్స్ షేరింగ్, డిఫెన్స్ అగ్రిమెంట్ల కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. పాకిస్థాన్ కొత్తగా తెస్తున్న హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లలో ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంది.
సాధారణ సబ్ మెరైన్లు బ్యాటరీ ఛార్జింగ్ కోసం తరచూ నీటి పైకి రావాలి. కానీ ఇవి ఎక్కువ కాలం నీటి అడుగునే ఉండిపోతాయి. వీటిని పసిగట్టడం కష్టం. అయితే 1971తో పోలిస్తే భారత నేవీ ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంది. న్యూక్లియర్ సబ్ మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మన సొంతం. అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ భారత్ తన నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది. కాబట్టి బంగాళాఖాతంలో పాకిస్థాన్ ఆటలు సాగకపోయినా.. వారి ఉనికి మాత్రం భారత్ కు ఒక చికాకుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
-
Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
-
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
-
Anupama Singh: “మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది”.. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!