EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కసారి ఊహించండి. మీరు పెట్రోల్ బంక్కి వెళ్లారు. ఒకవైపు లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు పైగా కనిపిస్తోంది. మరోవైపు అదే బంక్లో ఉన్న మరో ఇంధనం దాదాపు 20రూపాయలు తక్కువ ధరకు దొరుకుతోంది. అప్పుడు ఎవరైనా ఏం అనుకుంటారు? తక్కువ ధర ఉన్నదే ఎక్కువ లాభమని భావిస్తారు. కానీ ఇంధనాల విషయంలో కనిపించేది ఒకటి, అసలు లెక్క మాత్రం మరోటి. ప్రస్తుతం భారత్లో చర్చకు కారణమైన ఈ ఇంధనం పేరు E85. లీటర్ ధర తక్కువగా ఉండటంతో చాలా మందికి ఇది భవిష్యత్తు ఇంధనంలా కనిపిస్తోంది. అయితే పెట్రోల్ కంటే చీప్గా కనిపించే ఈ ఇంధనం నిజంగానే మన జేబుకు మేలు చేస్తుందా?
దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇంధనం అంటే కేవలం ద్రవం కాదని తెలుసుకోవాలి. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. మన కారు ఆ శక్తినే ఉపయోగించి ముందుకు కదులుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం.
ఇద్దరు పిల్లలకు ఒకే పరిమాణంలో ఉన్న రెండు బ్యాగులు ఇచ్చారని అనుకోండి. బయటకు చూస్తే రెండూ ఒకేలా కనిపిస్తాయి కానీ.. ఒక బ్యాగులో ఎక్కువ పుస్తకాలు ఉంటే, మరొక బ్యాగులో తక్కువ పుస్తకాలు ఉంటే వాటి బరువు ఒకేలా ఉండదు. ఫ్యూయల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక లీటర్ పెట్రోల్లో ఉన్న శక్తి, ఒక లీటర్ ఇథనాన్లో ఉండే శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది. E20 అంటే 20శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమం. ప్రస్తుతం భారత్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఇంధనం ఇదే. అయితే E85లో మాత్రం 85శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. అంటే పెట్రోల్ పరిమాణం చాలా తక్కువ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
Also Read
- Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
- Europe Heat Wave: డేంజర్ జోన్లో యూరప్.. వేలాది మరణాలపై సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!
ఇథనాల్ వాడితే మైలేజీ తగ్గుతుందా?
ఇథనాల్లో పెట్రోల్ కంటే దాదాపు 30శాతం తక్కువ శక్తి ఉంటుంది. అందుకే కారు అదే దూరం వెళ్లాలంటే ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఒక కారు E20 మీద లీటరుకు 18కిలోమీటర్లు వెళ్తుందని అనుకుందాం. అదే కారు E85 ఉపయోగిస్తే లీటరుకు 13 లేదా 14 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం కావచ్చు. ఇప్పుడు లెక్కలు చూస్తే ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. 100 కిలోమీటర్లు ప్రయాణించాలంటే E20తో దాదాపు 567రూపాయలు ఖర్చవుతుంది. కానీ E85తో అదే 100 కిలోమీటర్లకు దాదాపు 608రూపాయలు ఖర్చవుతుంది. అందుకే లీటర్ ధర చూసి మాత్రమే ఇంధనం చౌక అని చెప్పలేం. ఆ ఇంధనంతో కారు ఎంత దూరం వెళ్తుందనేదే అసలు లెక్క. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు ఇథనాల్ను ఎందుకు అంతగా ప్రోత్సహిస్తున్నాయనే సందేహం రావచ్చు.
ఇండియాకు బ్రెజిల్ నేర్పుతున్న పాఠమేంటి?
దీనికి బెస్ట్ ఎగ్జాంపూల్ బ్రెజిల్. దాదాపు 5దశాబ్దాల క్రితం ప్రపంచాన్ని చమురు సంక్షోభం కుదిపేసినప్పుడు బ్రెజిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం మీద ఆధారపడకుండా తమ దేశంలో విస్తారంగా పండే చెరకు నుంచి ఇథనాల్ తయారు చేయడం ప్రారంభించింది. క్రమంగా అక్కడి కార్లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలుగా మార్చారు.
అంటే పెట్రోల్ అయినా, ఇథనాల్ అయినా, రెండింటి మిశ్రమమైనా వాడగలిగేలా తయారుచేశారు. నేడు బ్రెజిల్లో లక్షలాది వాహనాలు ఇథనాల్పై నడుస్తున్నాయి. అయితే బ్రెజిల్ ప్రజలు కూడా ఒక సింపుల్ రూల్ను పాటిస్తారు. ఇథనాల్ ధర పెట్రోల్ ధరలో 70శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది నిజంగా ప్రాఫిట్ అని భావిస్తారు. ఎందుకంటే తక్కువ శక్తి ఉండటం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని వారికి తెలుసు. అయితే ఈ టాపిక్ని కేవలం మైలేజ్తో ముగించలేం. ఎందుకంటే ఇక్కడ దేశ ఆర్థిక భద్రత అనే పెద్ద అంశం ఉంది. ఇండియా తనకు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినా, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినా లేదా చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకినా మన దేశంపై ప్రభావం పడుతుంది. అప్పుడు పెట్రోల్ ధరలు కూడా వేగంగా పెరుగుతాయి. కానీ ఇథనాల్ మాత్రం మన దేశంలోనే తయారవుతుంది.
ముఖ్యంగా చెరకు, మొక్కజొన్న లాంటి పంటల నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం పర్యావరణం. పెట్రోల్ దహనం వల్ల విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలతో పోలిస్తే ఇథనాల్ కొంత మేర తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అల్టెర్నెట్ ఇంధనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించే వరకు ఇథనాల్ ఒక మధ్యంతర పరిష్కారంగా ఉపయోగపడుతుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి E85 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రస్తుతం డబ్బు ఆదా చేసే మాయా ఇంధనం కాదు.
లీటర్ ధర తక్కువగా కనిపించినా ప్రతి కిలోమీటర్ ఖర్చు పరంగా చూస్తే పెట్రోల్ కంటే ఎప్పుడూ చౌకగా ఉండకపోవచ్చు. కానీ దేశ భవిష్యత్తు ఇంధన భద్రత, రైతుల ఆదాయం, విదేశీ చమురుపై ఆధారాన్ని తగ్గించడం వంటి పెద్ద లక్ష్యాల కోసం ఇది ఒక కీలక అడుగు. రేపు ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగితే ఇదే E85 ఒక్కసారిగా అత్యంత ఆకర్షణీయమైన ఇంధనంగా మారవచ్చు. అందుకే E85 కథ కేవలం పెట్రోల్ బంక్ దగ్గర మొదలై అక్కడే ముగిసిపోదు. ఇది భారత్ ఇంధన భవిష్యత్తును నిర్ణయించే పెద్ద ప్రయోగంలో భాగంగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Monsoon Health Alert: రెయిన్ అలర్ట్ అంటే హెల్త్ అలర్ట్ కూడా.. పిల్లలకు ఎక్కువగా వచ్చే వ్యాధులు ఇవే.. వైద్యుల హెచ్చరిక
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్కు ఒకటే చెప్పాం.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Adivi Sesh: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అడివి శేష్.. అక్టోబర్లో కొత్త యాక్షన్ మూవీ షూటింగ్!
-
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!