ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీపిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 240 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు – 240
బోటనీ-19, కెమిస్ట్రీ-26, కామర్స్-35, కంప్యూటర్ అప్లికేషన్స్-26, కంప్యూటర్ సైన్స్-31, ఎకనామిక్స్-16, హిస్టరీ-19, మ్యాథమేటిక్స్-17, ఫిజిక్స్-11, పొలిటికల్ సైన్స్-21, జువాలజీ-19..
జోన్1-68, జోన్2-95, జోన్3-50, జోన్4-77..
అర్హత..
సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పీహెచ్డీ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం..
రూ.57,700 నుంచి రూ.1,82,400.
ఎంపిక విధానం..
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం..
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ(డిగ్రీ స్టాండర్డ్) నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు), సంబంధిత సబ్జెక్టు(పీజీ స్టాండర్డ్) నుంచి 150 ప్రశ్నలు(300 మార్కులు) అడుగుతారు. ప్రతి పేపర్కు 150 నిమిషాల సమయం ఉంటుంది.
దరఖాస్తు విధానం..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.01.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే 2024..
ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్.. https://psc.ap.gov.in/ పరిశీలించగలరు..