Kurnool Crime: వైసీపీ మాజీ ఎంపీటీసీ దారుణ హత్య
- వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ దారుణ హత్య..
- కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద ఘటన..
- రమేష్ ను బండ రాయితో తలపై కొట్టి చంపిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ హత్య స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. మీదివేములలో శాంతి, భద్రతలను ఎస్పీ సమీక్షించారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ. వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడును చంపింది టీడీపీ నాయకులేనని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని. వైసీపీ కి గ్రామంలో పట్టున్నందుకు సహించలేక హత్య చేశారన్నారాయన.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైసీపీ వాళ్ళను హత్య చేయడమేనా అని ప్రశ్నించారు కాటసాని. కాగా, రమేష్ నాయుడు 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. రమేష్ నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also: Elon Musk: సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు
Also Read
తాజావార్తలు
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!