Medak Crime: వీడు అసలు మనిషేనా..? పండు ముసలిపై అఘాయిత్యం.. ఆపై గొంతు నులిమి హత్య..
- మెదక్ జిల్లాలో దారుణం..
- టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య..
- ఆ తర్వాత వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లు ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: కామంతో కళ్లుచూసుకుపోయిన కామాంధులు.. చిన్నా చితక.. ముసలి ముతక అనే తేడా లేకుండా.. త వాంఛను తీర్చుకుంటున్నారు.. అంతేకాదు.. వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు.. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించి ఉడాయించాడు. అయితే, శివకుమార్ (28) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తేల్చారు.
Read Also: Waqf board Bill: వక్ఫ్ బోర్డు మాఫియా వశమైంది.. ప్రతిపక్షాలపై కేంద్రం ఆగ్రహం..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
టేక్మాల్ మండలం సాలోజిపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు సంతానం.. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కూతురు సాలోజిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని జరిపించారు. అనంతరం దుర్గయ్య అంజమ్మ దంపతులు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా దైవ చింతనలో గడిపేందుకు గత 20 ఏళ్ల క్రితం సాలోజిపల్లి గ్రామా శివారులో శ్రీ దత్తాశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దుర్గయ్య గత కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూశాడు.. అయితే, దుర్గయ్య మృతి అనంతరం అంజమ్మ శ్రీ దత్తాశ్రమంలోనే ఒంటరిగా ఉంటూ తన శేష జీవితాన్ని గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే అంజమ్మ కూతురు అల్లుడు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి అంజమ్మ యోగక్షేమలపై ఆరా తీసేవారు. తమ వద్దే ఉండాలని కూతురు అల్లుడు ప్రాధేయపడిన అంజమ్మ నిరాకరించేదని అన్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్థరాత్రి అంజమ్మ అల్లుడు తన విధులు ముగించుకొని ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్న తన అత్తగారిని రోజువారీగా భోజనం ఇచ్చి పలకరించేందుకు వెళ్లిన సమయంలో అంజమ్మ స్పృహ కోల్పోయి మిగతాజీవిగా పడి ఉండడాన్ని గమనిచాడు. చీకట్లో శివకుమార్ కూడా ఉండడంతో అనుమానంతో నిలదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివకుమార్ అంజమ్మ అల్లుడుపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో అంజమ్మ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి