Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..
Young Girl Commits Suicide In Medak After Husband Leaves Her: ప్రేమన్నాడు.. నువ్వు లేకుండా బ్రతకలేనన్నాడు.. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. పాపం.. ఆ అమ్మాయి అతని మాయమాటల్లో పడి ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. పెళ్లయ్యాక అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. రెండంటే రెండు రోజులకే ఆ అమ్మాయిని వదిలేశాడు. తమ కులాలు వేరు కాబట్టి, కలిసి జీవించడం కష్టమని చెప్పాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం చేయమని వేడుకున్నా.. ఒక్కరు కూడా కనికరించకపోవడంతో పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్ను వదిలేసి కుట్లేశారు..!
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఆ వివరాల్లోకి వెళ్తే.. తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18) వెంటపడ్డాడు. నువ్వు లేకుండా ఉండలేనని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో.. తేజశ్రీ అతని ప్రేమని అంగీకరించింది. అలా మూడేళ్లు ప్రేమించుకున్న వీళ్లిద్దరు.. గతేడాది అక్టోబర్ 15వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం కాపురం చేసుకుంటామని.. అక్టోబర్ 19వ తేదీన పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు. అయితే.. ప్రేమించినప్పుడు అడ్డు రాని కులాల వ్యవహారాన్ని పెళ్లయ్యాక యశ్వంత్రెడ్డి లేవనెత్తాడు. ఇద్దరిది వేర్వేరు కులాలు కాబట్టి.. తాను కలిసి ఉండలేనంటూ యశ్వంత్ ఆ యువతిని వదిలి వెళ్లిపోయాడు.
Formula E Hyderabad: ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్షిప్.. బుక్ మై షోలో టికెట్స్
భర్త వదిలేయడంతో కుంగిపోయిన తేజశ్రీ.. తనకు న్యాయం చేయమని కులపెద్దల్ని ఆశ్రయించింది. వాళ్లు ఆమెకి అండగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. యశ్వంత్ తిరిగి కాపురానికి రావాలని నిలదీశారు. అయినా న్యాయం జరగలేదు. దీంతో తేజశ్రీ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నెలరోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. కుటుంబీకులు తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్ ఇంటి వద్ద ఉంచి, ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాళ్లు ఆందోళన విరమించి, తేజశ్రీ అంత్యక్రియలు చేశారు.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో