AP Crime: దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య.. 2 రోజులు మృతదేహంతోనే నరకం చూసిన చిన్నారి..!
- దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య..
- తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకున్న మహిళ..
- రెండు రోజుల పాటు నరకం చూసిన చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.. దట్టమైన పొదల్లో.. తల్లి మృతదేహం వెనుకే వేలాడింది.. ఆకలి తట్టుకోలేక ఆ చిన్నారి ఎంత అలమటించిపోయిందో.. ఎవరూ కనిపించక.. రెండు రోజుల పాటు ఎంత భయంతో వణికిపోయిందో.. చివరకు తల్లి జోలె నుంచి కిందకు జారి.. పొదల నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు పొక్కింది.
Read Also: BRS-Congress Flexi War: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్.. హరీష్ రావు ట్వీట్ వైరల్..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మ (25).. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన కొండాను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.. వారిలో రెండేళ్ల చిన్న కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. పానిరంగనీలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్లింది పద్మ.. బుధవారం తన సోదరి ఇంటికి వెళ్లిన ఆమ.. అందరితో కలిసి భోజనం చేసింది. ఇక, ఇంట్లోవాళ్లు పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పద్మ కనిపించలేదు. దీంతో.. వారు పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని భావించారు. అయితే, రెండు రోజుల తర్వాత చివరకు శుక్రవారం రోజు ఉదయం రెండేళ్ల చిన్నారి పానిరంగిని గ్రామ సమీపంలో ఏడ్చుకుంటూ రావడంతో వారు చుట్టుపక్కల వెతికారు. హైవే పక్కన సమీపంలో పొదల్లో చెట్టుకు వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. పాపని తన జోలెలో చుట్టుకుని పద్మ ఉరివేసుకొని మృతి చెందినట్టు.. ఆ పరిస్థితులను గమనించినవారు చెబుతున్నారు.. రెండు రోజులపాటు చిన్నారి ఎంత బాధకు గురైందో ఎంతలా ఏడ్చిందో . చివరకు ఎలాగోలా జోలి నుంచి విడిపడి చిన్నారి రోడ్డుపైకి చేరుకుంది. ఈ హృదయ విదారక సంఘటనను తలుచుకుంటేనో అందరి హృదయాలను కలచివేస్తోంది.. చిన్నారి పుష్పను దోమలు, పురుగులు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. పోలీసులు అనుమానస్పద మృతిగా చేసి నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.. క్లూస్ టీమ్ను రప్పించి వివరాలు సేకరించే పనిలో పడిపోయారు..
తాజావార్తలు
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!