AP Crime: దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య.. 2 రోజులు మృతదేహంతోనే నరకం చూసిన చిన్నారి..!
- దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య..
- తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకున్న మహిళ..
- రెండు రోజుల పాటు నరకం చూసిన చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.. దట్టమైన పొదల్లో.. తల్లి మృతదేహం వెనుకే వేలాడింది.. ఆకలి తట్టుకోలేక ఆ చిన్నారి ఎంత అలమటించిపోయిందో.. ఎవరూ కనిపించక.. రెండు రోజుల పాటు ఎంత భయంతో వణికిపోయిందో.. చివరకు తల్లి జోలె నుంచి కిందకు జారి.. పొదల నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు పొక్కింది.
Read Also: BRS-Congress Flexi War: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్.. హరీష్ రావు ట్వీట్ వైరల్..
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మ (25).. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన కొండాను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.. వారిలో రెండేళ్ల చిన్న కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. పానిరంగనీలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్లింది పద్మ.. బుధవారం తన సోదరి ఇంటికి వెళ్లిన ఆమ.. అందరితో కలిసి భోజనం చేసింది. ఇక, ఇంట్లోవాళ్లు పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పద్మ కనిపించలేదు. దీంతో.. వారు పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని భావించారు. అయితే, రెండు రోజుల తర్వాత చివరకు శుక్రవారం రోజు ఉదయం రెండేళ్ల చిన్నారి పానిరంగిని గ్రామ సమీపంలో ఏడ్చుకుంటూ రావడంతో వారు చుట్టుపక్కల వెతికారు. హైవే పక్కన సమీపంలో పొదల్లో చెట్టుకు వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. పాపని తన జోలెలో చుట్టుకుని పద్మ ఉరివేసుకొని మృతి చెందినట్టు.. ఆ పరిస్థితులను గమనించినవారు చెబుతున్నారు.. రెండు రోజులపాటు చిన్నారి ఎంత బాధకు గురైందో ఎంతలా ఏడ్చిందో . చివరకు ఎలాగోలా జోలి నుంచి విడిపడి చిన్నారి రోడ్డుపైకి చేరుకుంది. ఈ హృదయ విదారక సంఘటనను తలుచుకుంటేనో అందరి హృదయాలను కలచివేస్తోంది.. చిన్నారి పుష్పను దోమలు, పురుగులు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. పోలీసులు అనుమానస్పద మృతిగా చేసి నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.. క్లూస్ టీమ్ను రప్పించి వివరాలు సేకరించే పనిలో పడిపోయారు..
తాజావార్తలు
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!