Karnataka: మూగవాడైన కొడుకుని మొసళ్లు ఉండే నదిలో విసిరేసిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య మూగవాడైన కన్నకొడుకుని మొసళ్లు ఉంటే నదిలో పారేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఉత్తర కన్నడి జిల్లాలో జరిగింది. జిల్లాలోని దండేలి తాలూకాకు చెందిన భార్య, భర్తల మధ్య పెద్ద కొడుకు అంగవైకల్యంపై తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగానే మరోసారి భార్య సావిత్రి, భర్త రవికుమార్(27) మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఎందుకు మూగ బిడ్డకు జన్మనిచ్చావని, అతడిని దూరంగా తీసుకెళ్లు అని కొన్నిసార్లు భర్త, భార్యకు చెప్పేవాడని పోలీసులు తెలిపారు.
Read Also: Chandrababu: కిరణ్ కుమార్ రెడ్డి, జయచంద్రా రెడ్డిని గెలిపించండి
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఈ జంటకు ఆరు, రెండేళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కొడుకు పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టాడు. పెద్ద కొడుకు విషయంలో భార్యభర్తలకు గొడవ జరుగుతుండేది. శనివారం సాయంత్రం కూడా మరోసారి గొడవ జరగగా, సావిత్రి తన పెద్ద కొడుకును మొసళ్లు ఎక్కువగా ఉండే కాళీ నదితో కలిసి కాలువలో విసిరేసింది. దీనిపై ఇరుగుపొరుగు వారు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి స్థానికులు, డైవర్ల సాయంతో చిన్నారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, చీకటి పడిపోవడంతో పోలీసులకు చిన్నారి ఆచూకీ లభించలేదు.
ఆదివారం ఉదయం పోలీసులు పిల్లవాడి మృతదేహాన్ని కనుగొన్నారు. శరీరంపై కాటు గుర్తులు, తీవ్రగాయాలు ఉన్నాయి. పిల్లవాడి ఒక చేయి లేదు. మొసలి దాడి చేసి ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!