Bhopal: సినిమా తరహాలో ట్విస్ట్.. 2 ఏళ్ల తర్వాత హతురాలు ప్రత్యక్షం.. జైల్లో మగ్గుతున్న నిందితులు
- మధ్యప్రదేశ్లో సినిమా తరహాలో ట్విస్ట్
- 2 ఏళ్ల తర్వాత హతురాలు ప్రత్యక్షం
- జైల్లో మగ్గుతున్న నిందితులు
- కోర్టును ఆశ్రయించిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో సినిమా తరహాలో ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 2023లో హత్యకు గురైనట్లు భావించిన మహిళ.. తాజాగా సజీవంగా ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు షాక్కు గురయ్యారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను పట్టుకుని జైల్లో వేశారు. వీళ్లంతా రెండేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నారు. తాజాగా హతురాలు అనబడిన ఆమె ప్రత్యక్షం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
మాండ్సౌర్ జిల్లా గాంధీ సాగర్ ప్రాంతానికి సంబంధించిన లలితా బాయి(35).. 2023, సెప్టెంబర్లో కనిపించకుండా పోయింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని రోజుల తర్వాత ట్రక్కు ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటపడింది. అందులో బాధితురాలి తల నలిగిపోయింది. ఆ ఫొటోను బాధితురాలి తండ్రికి చూపించగా.. పుట్టిమచ్చలు.. నల్లటిదారాన్ని బట్టి తమ కుమార్తెగా భావించాడు. మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా స్మశానానికి తీసుకెళ్లి దహనం చేశాడు.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
లలితా బాయిను హత్య చేశారంటూ నలుగురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇమ్రాన్, షారుఖ్, సోను, ఎజాజ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే తాజాగా చనిపోయినట్లు భావించిన లలితా బాయి.. మాండ్సౌర్ జిల్లాలోని తన గ్రామంలో సజీవంగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే తండ్రి… లలితా బాయిను గాంధీ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సమాచారం తెలియజేశాడు. ఆమె లలితా బాయిగా ఆఫీసర్ ఇన్చార్జ్ తరుణ భరద్వాజ్ ధృవీకరించాడు.
మిస్సింగ్పై లలితా బాయిను పోలీసులు ఆరా తీయగా.. షారుఖ్ అనే వ్యక్తి.. భాన్పురాకు తీసుకెళ్లాడని.. అక్కడ రూ.5లక్షలకు అమ్మేసినట్లు పేర్కొంది. రెండో వ్యక్తి కూడా రాజస్థాన్లోని కోటకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడ 18 నెలలు నివసించినట్లు తెలిపింది. అక్కడ నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చినట్లుగా లలితా బాయి తెలిపింది. తన దగ్గర మొబైల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయినట్లు పోలీసులకు తెలిపింది. ఏడాదిన్నర తర్వాత పిల్లలను కలిసింది. ఇక తన గుర్తింపును నిర్ధారించడానికి ఆమె ఆధార్ కార్డు, ఓటర్ కార్డులను చూపించగా పోలీసులు ఆమెను లలితా బాయిగా ధృవీకరించారు.
హతురాలు తిరిగి ప్రత్యక్షం కావడంతో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై స్థానిక పోలీసుల నుంచి సమాచారం కోరింది. కోర్టుకు సమాచారం అందిస్తామని ఝబువా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. ముందుగా లలితా బాయికి వైద్య పరీక్షలు, డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే సాక్షుల వాంగ్మూలాలను కూడా కొత్తగా నమోదు చేస్తామని చెప్పారు. గతంలో సమగ్ర దర్యాప్తు తర్వాతే.. తాము హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ కేసుపై న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!