మధ్యప్రదేశ్లో సినిమా తరహాలో ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 2023లో హత్యకు గురైనట్లు భావించిన మహిళ.. తాజాగా సజీవంగా ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు షాక్కు గురయ్యారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను పట్టుకుని జైల్లో వేశారు. వీళ్లంతా రెండేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నారు. తాజాగా హతురాలు అనబడిన ఆమె ప్రత్యక్షం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.