Extramarital Affair: భార్య కిరాతకం.. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి..
Woman Killed Her Husband With Help Of Boyfriend In Kurnool: ప్రియుడి మోజులో ఒక భార్య కిరాతక పనికి పాల్పడింది. కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా చంపింది. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి.. భర్తని అంతమొందించింది. అనంతరం ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం పెద్ద స్కెచ్ వేసింది. తన భర్తను చంపేశాక, భర్త కనిపించడం లేదంటూ పెద్ద డ్రామా ఆడింది. తీరా తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు.. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో భార్య బాగోతం మొత్తం బయటపడింది, అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి ఆ మహిళ జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Uniform Bites By Rats: హవ్వ.. యూనిఫాం ఎలుకలు కొరికేశాయట..
Also Read
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణకు 2008లో దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన ఉప్పర వరలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కట్ చేస్తే.. ఉప్పర నారాయణ మద్యానికి బానిస కావడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా భర్త మారకపోవడంతో.. వరలక్ష్మి విసుగుచెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు.. ఆమెను మందలించి పుట్టినిల్లుకు పంపించారు. ఆ భాధలో ఆమె తన సమీప బంధువు అయిన గోవిందుకు ఫోన్ చేసి, జరిగిన విషయం చెప్పింది. ఇలా వీరి మధ్య సంభాషణలు పెరగడంతో.. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే గోవిందుతో కలిసి, తన భర్తను అంతం చేయాలని వరలక్ష్మి పథకం రచించింది.
US Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు దుర్మరణం
2022 మే నెల 27వ తేదీన.. చిన్న గోవిందుతో కలిసి తన భర్త ఉప్పర నారాయణకు ఫోన్ చేసింది. వెంటనే ఎమ్మిగనూరుకు రావాలని కోరగా.. అతడు బయలుదేరి వెళ్లాడు. అక్కడి నుంచి బెళగల్కు, అనంతరం కర్నూలుకు వెళ్లారు. నారాయణకు ఫుల్గా మద్యం తాపించి, రాత్రి 10 గంటలకు కర్నూలు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చారు. కొంత దూరం నడుచుకొని వెళ్లాక.. మద్యం మత్తులో ఉన్న నారాయణను రైల్వే ట్రాక్పై పడుకోబెట్టారు. ఆ టైంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తున్న రైలు నారాయణ పైనుంచి వెళ్లడంతో.. అతడు మరణించాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న గోవిందు.. నారాయణ సెల్ఫోన్లోని సిమ్ కార్డును మరో సెల్ఫోన్లో మార్చి, మహిళ వాయిస్ వచ్చేలాగా సిట్టింగ్ చేసుకుని.. ఆ నంబర్ వచ్చే కాల్స్ స్వీకరించడం మొదలుపెట్టారు.
Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ హీట్ ఎక్కించడంలో నెంబర్ 1
కట్ చేస్తే.. 2022 మే 30వ తేదీన తన భర్త నారాయణ కనిపించడం లేదని భార్య వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. పోలీసులకు అనుమానం వచ్చి, వరలక్ష్మి కాల్ డేటాని పరిశీలించారు. ఇంకేముంది.. వారిద్దరి బండారం బట్టబయలు కావడంతో, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో.. తామే నారాయణను చంపినట్టు గోవిందు, వరలక్ష్మి తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరిచి.. రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!