Extramarital Affair: ఓవైపు ఎఫైర్, మరోవైపు వరకట్న వేధింపులు.. చివరికి ఆ వివాహిత?
Woman Commits Suicide Due To Husband Affair And Domestic Harassment: తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అత్తారింటి నుంచి వరకట్న వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఓ వివాహిత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్కు చెందిన కావ్యశ్రీ(26)కి నవీపేటకు చెందిన ఎర్ర మనోజ్తో 2020లో వివాహం జరిగింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. తన భార్యపై మనోజ్ బాగానే ప్రేమ చూపించేవాడు. అయితే.. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు కావ్యశ్రీని పట్టించుకోవడం మానేశాడు. తాను ఎంత ప్రేమగా ఉండాలని కావ్యశ్రీ ప్రయత్నించినా.. మనోజ్ అస్సలు పట్టించుకునేవాడే కాదు.
CV Anand: హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో 7 వేల మందికి టోకరా.. రూ.200 కోట్లు ఢమాల్
Also Read
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని కావ్యశ్రీ ఆరాతీయగా.. అప్పుడు మనోజ్కి మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని రివీల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే మనోజ్ని కావ్యశ్రీ నిలదీయగా.. అతడు సరిగ్గా స్పందించలేదు. దీంతో.. ఈ విషయాన్ని ఆమె పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. పెద్దలందరూ ఇరువురికి సర్దిచెప్పి.. సరిగ్గా కాపురం చేసుకోవాలని సూచించారు. ఆ సమయంలో మనోజ్ ఓకే చెప్పాడు కానీ, మళ్లీ తన ప్రియురాలితో సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేశాడు. ఈ బాధ చాలదన్నట్టు.. కావ్యశ్రీని అదనపు కట్నం తీసుకుని రావాలంటూ మనోజ్ నిత్యం వేధించేవాడు. తనకు అప్పు ఉండటం వల్లే అతడు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామలు కూడా కావ్యశ్రీని వేధించసాగారు. దీంతో కావ్యశ్రీ మరింత కుంగిపోయింది. భర్త ఎఫైర్, అత్తారింటి వరకట్న వేధింపులు భరించలేక.. బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడింది.
Jawan: మెంటలెక్కిస్తున్న జవాన్ క్రేజ్.. ట్రైలర్ రిలీజ్ కాకుండానే అన్ని కోట్లా?
తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి.. కావ్యశ్రీ తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కూతురును అదనపు కట్నం కోసం వేధించడంతోనే, ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. భర్త మనోజ్, అత్తమామలైన అరుణ, మహేష్పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!