Married Woman: భర్తతో విడాకులు.. మరొకరితో సహజీవనం.. ఇంతలో ఊహించని ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Woman: ఒక్కోసారి కొందరు ఆవేశంలో లేనిపోని నిర్ణయాలు తీసుకుంటుంటారు. సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకునే కోణంలో ఆలోచించరు. సమస్యలు తీవ్రమైనప్పుడు.. తీవ్ర ఆందోళనలో చంపడమో లేక చావడమో వంటి పనులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ వివాహిత కూడా అదే పని చేసింది. భర్తతో విడిపోయి, మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె.. ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Viral Video: మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన తల్లి.. వీడియో వైరల్!
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరుకు చెందిన శ్రీలేఖ (28) అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. దీంతో.. శ్రీలేఖ భర్తతో విడాకులు తీసుకొని, ఒంటరిగా నివసించసాగింది. ఈ క్రమంలోనే ఆమెకు దుర్గప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లు హ్యాపీగానే గడిపారు కానీ, క్రమంగా వీరి మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారు. బుధవారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.
Shamshabad: శంషాబాద్ హత్య కేసు మిస్టరీ వీడింది.. మృతి చెందిన మహిళ మంజుల..!
అప్పుడు దుర్గప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాసేపయ్యాక ఇంటికి తిరిగిరాగా.. ఇంటి తలుపులు వేసి ఉండటాన్ని గమనించాడు. డోర్ తీయమని గట్టిగా కేకలు వేశాడు. కానీ.. లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, చుట్టుపక్కల వారి సహాయంతో దుర్గప్రసాద్ తలుపులు బద్దలుకొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. శ్రీలేఖ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సమాచారం పోలీసులకు అందజేయగా.. వాళ్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, శ్రీలేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొదట భర్తతో విడాకులు, ఆ తర్వాత ప్రియుడితో మనస్పర్థలు ఏర్పడిన నేపథ్యంలో.. శ్రీలేఖ నిరాశకు గురై ఈ నిర్నయం తీసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..