UP: అర్ధరాత్రి ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. కుమార్తె నిద్ర లేవడంతో..!
- యూపీలోని లక్నోలో దారుణం
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన దుర్మార్గురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం కలిసుండాల్సిన ఆలుమగల మధ్యలోకి మరొకరు ప్రవేశించడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కడంతో సంసార జీవితం అతలాకుతలం అయిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రియుడితో సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని.. ఇంట్లోనే మరణశాసనం రాసింది ఓ దుర్మార్గురాలు. ప్రియుడితో కలిసి పతిని తుది ముట్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఠాకూర్గంజ్లో చోటుచేసుకుంది.
శత్రుఘ్న రాథోడ్ (50), రాఖీ రాథోడ్ భార్యాభర్తలు. శత్రుఘ్న రాథోడ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. అయితే శత్రుఘ్న రాథోడ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. దీంతో రాఖీ రాథోడ్ దారి తప్పింది. ధర్మేంద్ర రాథోడ్ (40) అనే ఓ ట్రావెల్ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటూ ఉండేవారు. ఇలా అక్రమ సంబంధం సాగిపోతుండగా.. ఒకసారి హఠాత్తుగా భర్త శత్రుఘ్న రాథోడ్ కంట్లో పడ్డారు. దీంతో ఇద్దరిని తీవ్రంగా హెచ్చరించాడు. అంతే అప్పటి నుంచి కసితో రగిలిపోయారు. తమ సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. అంతే డిసెంబర్ 30, 2024న హత్యకు ప్లాన్ వేశారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
శత్రుఘ్న రాథోడ్ పనులు ముగించుకుని డిసెంబర్ 30న రాత్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక ఓ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తల్లి, నలుగురు కూతుళ్ల మరొక గదిలో నిద్రించారు. అయితే అర్ధరాత్రి 1:30 సమయంలో ధర్మేంద్ర రాథోడ్, అతని సోదరుడు అంకిత్ రాథోడ్, వాళ్ల స్నేహితుడు రంజిత్ విశ్వకర్మ ఇంట్లోకి ప్రవేశించి శత్రుఘ్న రాథోడ్ ప్రాణాలు తీశారు. అయితే డోర్ తీసిన సౌండ్ వినపడడంతో మెలకువుగా ఉన్న పెద్ద కుమార్తె లేచి.. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. దీంతో నిందితులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ పరిణామంలో 18 అడుగుల టెర్రస్ గోడపై నుంచి కిందకి దూకారు. నిందితుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ఓ సీసీకెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే తన భర్తను దుండగులు చంపేశారని రాఖీ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాము పడుకున్న డోర్ తలుపు గొళ్లెం ఎవరో బయటపెట్టారని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాఖీ రాథోడ్ను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. ధర్మేంద్ర రాథోడ్తో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. గుండెపోటుతో భర్త చనిపోయినట్లుగా.. సాధారణ మరణంగా చిత్రీకరించాలని నిందితులు చూశారని.. పెద్ద కుమార్తె నిద్ర లేవడంతో మర్డర్ ఫ్లాన్ విఫలమైందని డీసీపీ వెస్ట్ విశ్వజీత్ శ్రీవాస్తవ చెప్పారు. రాఖీ రాథోడ్తో సహా నిందితులు ధర్మేంద్ర రాథోడ్, అంకిత్ రాథోడ్, రంజిత్ విశ్వకర్మలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. భర్త భూమ్మీద లేకపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో నలుగురు కుమార్తెలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!