UP: అర్ధరాత్రి ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. కుమార్తె నిద్ర లేవడంతో..!
- యూపీలోని లక్నోలో దారుణం
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన దుర్మార్గురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం కలిసుండాల్సిన ఆలుమగల మధ్యలోకి మరొకరు ప్రవేశించడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కడంతో సంసార జీవితం అతలాకుతలం అయిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రియుడితో సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని.. ఇంట్లోనే మరణశాసనం రాసింది ఓ దుర్మార్గురాలు. ప్రియుడితో కలిసి పతిని తుది ముట్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఠాకూర్గంజ్లో చోటుచేసుకుంది.
శత్రుఘ్న రాథోడ్ (50), రాఖీ రాథోడ్ భార్యాభర్తలు. శత్రుఘ్న రాథోడ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. అయితే శత్రుఘ్న రాథోడ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. దీంతో రాఖీ రాథోడ్ దారి తప్పింది. ధర్మేంద్ర రాథోడ్ (40) అనే ఓ ట్రావెల్ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటూ ఉండేవారు. ఇలా అక్రమ సంబంధం సాగిపోతుండగా.. ఒకసారి హఠాత్తుగా భర్త శత్రుఘ్న రాథోడ్ కంట్లో పడ్డారు. దీంతో ఇద్దరిని తీవ్రంగా హెచ్చరించాడు. అంతే అప్పటి నుంచి కసితో రగిలిపోయారు. తమ సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. అంతే డిసెంబర్ 30, 2024న హత్యకు ప్లాన్ వేశారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
శత్రుఘ్న రాథోడ్ పనులు ముగించుకుని డిసెంబర్ 30న రాత్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక ఓ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తల్లి, నలుగురు కూతుళ్ల మరొక గదిలో నిద్రించారు. అయితే అర్ధరాత్రి 1:30 సమయంలో ధర్మేంద్ర రాథోడ్, అతని సోదరుడు అంకిత్ రాథోడ్, వాళ్ల స్నేహితుడు రంజిత్ విశ్వకర్మ ఇంట్లోకి ప్రవేశించి శత్రుఘ్న రాథోడ్ ప్రాణాలు తీశారు. అయితే డోర్ తీసిన సౌండ్ వినపడడంతో మెలకువుగా ఉన్న పెద్ద కుమార్తె లేచి.. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. దీంతో నిందితులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ పరిణామంలో 18 అడుగుల టెర్రస్ గోడపై నుంచి కిందకి దూకారు. నిందితుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ఓ సీసీకెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే తన భర్తను దుండగులు చంపేశారని రాఖీ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాము పడుకున్న డోర్ తలుపు గొళ్లెం ఎవరో బయటపెట్టారని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాఖీ రాథోడ్ను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. ధర్మేంద్ర రాథోడ్తో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. గుండెపోటుతో భర్త చనిపోయినట్లుగా.. సాధారణ మరణంగా చిత్రీకరించాలని నిందితులు చూశారని.. పెద్ద కుమార్తె నిద్ర లేవడంతో మర్డర్ ఫ్లాన్ విఫలమైందని డీసీపీ వెస్ట్ విశ్వజీత్ శ్రీవాస్తవ చెప్పారు. రాఖీ రాథోడ్తో సహా నిందితులు ధర్మేంద్ర రాథోడ్, అంకిత్ రాథోడ్, రంజిత్ విశ్వకర్మలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. భర్త భూమ్మీద లేకపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో నలుగురు కుమార్తెలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..