Woman Kills Husband: ‘‘కళ్లలో కారం కొట్టి, మెడపై కాలు పెట్టి’’.. లవర్తో కలిసి భర్తని చంపిన భార్య..
- భార్య చేతిలో మరో భర్త హతం..
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య..
- లవర్తో కలిసి భర్తను హతమార్చిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Kills Husband: దేశవ్యాప్తంగా మగాళ్లకు భద్రత లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా..? అనే అనుమానం వచ్చేలా హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దీనికి తాజాగా ఉదాహరణ, ఇటీవల మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హత్య. భార్య సోమన్ తన లవర్ రాజ్ కుష్వాహాతో ప్లాన్ చేసి హత్య చేసింది.
తాజాగా, కర్ణాటకలో కూడా ఇలాంటి ఘోరమే మరోకటి జరిగింది. ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. చంపిన తర్వాత మతదేహాన్ని 30 కి.మీ దూరంలో పారేసింది. జూన్ 24న ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలుకాలోని కడశెట్టిహళ్లీ గ్రామంలో జరిగింది.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
మృతుడిని 50 ఏళ్ల శంకరమూర్తిగా గుర్తించారు. ఇతను ఫామ్హౌజ్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. తిప్తూర్లోని కల్పతరు బాలికల హాస్టల్లో వంటమనిషిగా పనిచేసే భార్య సుమంగళకు, కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో అక్రమసంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తమకు అడ్డుగా ఉన్న భర్త శంకరమూర్తిని చంపడానికి ఇద్దరు కుట్ర పన్నారు.
నేరం జరిగిన రోజు రాత్రి, సుమంగళ తన భర్త శంకరమూర్తి కళ్లలో కారం పొడి చల్లి, కర్రలతో కొట్టి, అతడి మెడపై కాలుతో నక్కి దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు గోనె సంచిలో మృతదేహాన్ని దాచి దాదాపుగా 30 కి.మీ దూరంలోని తురువేకెరే తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలోని బావిలో పారేశారు.
నోనవినకెరే పోలీస్ స్టేషన్లో శంకరమూర్తి మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అయితే, పోలీస్ దర్యాప్తులో మృతుడి మంచంపై కారం పొడి ఆనవాళ్లు ఉండటం అనుమానం కలిగించింది. సుమంగళ విచారించడంతో, ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయడంతో హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. చివరకు ఆమె నేరాన్ని అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణ సాగుతోంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?