Crime: ఆ పనిచేస్తున్నాడని భర్త మర్మాంగంపై దాడి చేసిన భార్య.. దాన్ని పోసి
Crime: ప్రతి మనిషికి ప్రేమ, కోపం,ద్వేషం తో పాటు సహనం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆవిడవారికి సహనం ఎక్కువ ఉంటుందని ఆమెను భూమాత తో పోలుస్తూ ఉంటారు. అయితే ఆమె సహనం కోల్పోతే ఎలా ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. కాళీమాత ఉగ్ర రూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఒక మహిళ సహనం కోల్పోతే అలాగే ఉంటుంది అంటారు పెద్దలు. తాజాగా భర్త పెట్టే నరకాన్ని అనుభవించి, అనుభవించి ఒక మహిళ సహనాన్ని కోల్పోయింది. ఆ బాధలు భరించలేక ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. భర్తకు తగిన శిక్ష విధించాలనుకొంది. వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసి కసితీరా కోపాన్ని తీర్చుకున్నది. ఆ తరువాత చేసిన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన చెన్నైలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణిపేట జిల్లా కావేరిపాక్కం కి చెందిన తంగరాజ్ అనే వ్యక్తికి ప్రియ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత కొన్ని రోజులు బాగానే ఉన్న తంగరాజ్ ఆ తరువాత మృగంలా మారిపోయాడు. నిత్యం భార్యను అనుమానిస్తూ కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. భర్తను మార్చుకోవాలని ప్రయత్నించినా ప్రియ వలన కాలేదు. ఇక ఇటీవలే భర్త ఎందుకు ఇలా తయారయ్యాడో తెల్సుకొని షాకయ్యింది ప్రియ. వేరొక యువతితో భర్త సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఆమెకు కోపం కట్టలు తెంచుకోంది. తనకు నరకం చూపించిన భర్తకు తగిన శిక్ష వేయాలని భావించిన ఆమె మంగళవారం ఇంట్లో పడుకున్న భర్త మర్మాంగంపై మరుగుతున్న నీటిని కుమ్మరించింది. ఆ బాధను తట్టుకోలేక తంగరాజ్ అరుస్తుండడంతో తిరిగి ఆమెనే భర్తను ఆసుపత్రిలో చేర్పించి.. సరాసరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. తన భర్త వేధింపులకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నాడని, అందుకే అతనికి శిక్ష వేశానని పోలీసులకు తెలిపింది. ఇక మరోపక్క తంగరాజ్ దేహం 40 శాతం కాలిపోయిందని, మెరుగైన చికిత్స కోసం అతడిని వేలూరు ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!