Crime: ఆ పనిచేస్తున్నాడని భర్త మర్మాంగంపై దాడి చేసిన భార్య.. దాన్ని పోసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ప్రతి మనిషికి ప్రేమ, కోపం,ద్వేషం తో పాటు సహనం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆవిడవారికి సహనం ఎక్కువ ఉంటుందని ఆమెను భూమాత తో పోలుస్తూ ఉంటారు. అయితే ఆమె సహనం కోల్పోతే ఎలా ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. కాళీమాత ఉగ్ర రూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఒక మహిళ సహనం కోల్పోతే అలాగే ఉంటుంది అంటారు పెద్దలు. తాజాగా భర్త పెట్టే నరకాన్ని అనుభవించి, అనుభవించి ఒక మహిళ సహనాన్ని కోల్పోయింది. ఆ బాధలు భరించలేక ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. భర్తకు తగిన శిక్ష విధించాలనుకొంది. వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసి కసితీరా కోపాన్ని తీర్చుకున్నది. ఆ తరువాత చేసిన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన చెన్నైలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణిపేట జిల్లా కావేరిపాక్కం కి చెందిన తంగరాజ్ అనే వ్యక్తికి ప్రియ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత కొన్ని రోజులు బాగానే ఉన్న తంగరాజ్ ఆ తరువాత మృగంలా మారిపోయాడు. నిత్యం భార్యను అనుమానిస్తూ కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. భర్తను మార్చుకోవాలని ప్రయత్నించినా ప్రియ వలన కాలేదు. ఇక ఇటీవలే భర్త ఎందుకు ఇలా తయారయ్యాడో తెల్సుకొని షాకయ్యింది ప్రియ. వేరొక యువతితో భర్త సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఆమెకు కోపం కట్టలు తెంచుకోంది. తనకు నరకం చూపించిన భర్తకు తగిన శిక్ష వేయాలని భావించిన ఆమె మంగళవారం ఇంట్లో పడుకున్న భర్త మర్మాంగంపై మరుగుతున్న నీటిని కుమ్మరించింది. ఆ బాధను తట్టుకోలేక తంగరాజ్ అరుస్తుండడంతో తిరిగి ఆమెనే భర్తను ఆసుపత్రిలో చేర్పించి.. సరాసరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. తన భర్త వేధింపులకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నాడని, అందుకే అతనికి శిక్ష వేశానని పోలీసులకు తెలిపింది. ఇక మరోపక్క తంగరాజ్ దేహం 40 శాతం కాలిపోయిందని, మెరుగైన చికిత్స కోసం అతడిని వేలూరు ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..