Jharkhand: ‘‘నాపై ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు’’.. పీడకలను ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్పానిష్ మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్లో స్పానిష్ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ టూరిస్ట్ అయిన మహిళపై అతని భాగస్వామిపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. నిందితులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. ఈ పీడకలకు సంబంధించి స్పానిష్ మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ముఖం నిండా గాయాలతో భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఎవరూ కోరుకోనిద మాకు జరిగింది. ఏడుగురు వ్యక్తులు నన్ను రేప్ చేశారు’’ అంటూ బాధ వ్యక్తం చేశారు.
రెండు బైకులపై బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకు చేరుకుని, బీహార్ గుండా నేపాల్ వెళ్తున్న మహిళ, ఆమె భాగస్వామిని దోచుకుని, అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు మమ్మల్ని దోచుకున్నారని, వారు కోరుకున్నది తనను రేప్ చేయడమే అని ఆమె పోస్టులో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Read Also: Kerala: సీనియర్ అమ్మాయిలతో డ్యాన్స్ చేసినందుకు ర్యాగింగ్.. విద్యార్థి మృతి కేసులో 11 మంది అరెస్ట్..
దుమ్కా ఎస్పీ పితాంబర్ సింగ్ ఖేర్వార్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హాన్స్దిహా పోలీస్ పెట్రోలింగ్ టీం ఇద్దరు బాధితులను కనుగొన్నారని, వారికి ఏదో జరిగిందని పోలీసులు పసిగట్టారని, అయితే వారు స్పానిష్లో మాట్లాడటం వల్ల పోలీసులకు ఏం అర్థం కాలేదని, వారికి చికిత్స అవసరమని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని, వెంటనే విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఫోరెన్సిక్, సీఐడీ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ బీజేపీ చీఫ్, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ డిమాండ్ చేశారు. విదేశీయులకు ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్ణకరమని, నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!