AP Crime: ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్లో పెట్టిన కేసులో ట్విస్ట్ .. వెలుగులోకి కీలక విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన ఈ ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. పోలీసుల వివరాల ప్రకారం, నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ, పార్ట్టైమ్గా ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా పనిచేస్తోంది. ఈ పరిచయం తరువాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.
Read Also: New Model Cars: ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే కొత్త కార్లు ఇవే..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
అయితే, ఏడాది క్రితం రవీంద్ర రాజాం ప్రాంతానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. గాజువాకలోని ఎల్వి నగర్, కీర్తి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. వివాహం తరువాత అతని భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి పంపించాడు. అప్పటి నుంచి రవీంద్ర తన స్నేహితుడు, సోదరుడితో కలిసి అదే ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇక, అపార్ట్మెంట్ నివాసుల ప్రకారం, మౌనిక తరచూ రవీంద్ర ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మౌనిక తనను డబ్బుల కోసం వేధించేదని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. సుమారు రూ.3.5 లక్షలు దఫదఫాలుగా ఇచ్చినట్లు వెల్లడించాడు.
ఈ వివాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో, మౌనికను హత్య చేయాలని రవీంద్ర ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా ముందుగానే కత్తి ఆర్డర్ చేసినట్లు సమాచారం. అనంతరం మౌనికను ఇంటికి పిలిపించి, ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగి, బాత్రూమ్లో కత్తితో దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం, మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొంత భాగాన్ని ఫ్రిజ్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి బయటకు తీసుకెళ్లి దహనం చేసినట్లు కూడా తెలిసింది. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో సువాసన ద్రవ్యాలు పిచికారీ చేసి, రక్తపు మరకలను పూర్తిగా శుభ్రం చేసినట్లు సమాచారం.
ఈ ఘటన గురించి రవీంద్ర తన స్నేహితులకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రవీంద్ర పోలీసులకు లొంగిపోయాడు. ఇక, మౌనిక తండ్రి గోపాలరావు మాత్రం రవీంద్ర ఆరోపణలను ఖండించారు. తన కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేసి కావాలనే హత్య చేశాడని ఆయన ఆరోపించారు. తన కుమార్తెకు డబ్బుల కోసం ఎవరినీ వేధించే అవసరం లేదని, ఆమె స్థిరమైన ఉద్యోగంలో ఉందని తెలిపారు. అయితే, పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇంకా తలతో పాటు కొన్ని శరీర భాగాలు గల్లంతైనట్లు సమాచారం. కేసులో కీలక ఆధారాలుగా నిందితుడు, మృతురాలి మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, వాట్సాప్ చాట్లు, సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ప్లాస్టిక్ కవర్లు, సువాసన ద్రవ్యాల బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రవీంద్ర వర్షన్, మౌనిక కుటుంబ సభ్యుల వాదనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?