New Model Cars: ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే కొత్త కార్లు ఇవే..
- ఏప్రిల్ నెలలో కొత్త కొత్తగా..
- కొత్త మోడళ్లతో తళుక్కుమననున్న కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. కారు అనేది ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా.. నేడు అదొక హోదాకు, సౌకర్యానికి చిహ్నంగా మారింది. అందుకే మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. వాహన ప్రియుల్లో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. కారు మైలేజీ ఎంత? అందులో ఉన్న అధునాతన ఫీచర్లు ఏమిటి? భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అన్నింటికీ మించి మన బడ్జెట్కు అందుబాటులో ఉంటుందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి లగ్జరీ కార్లను ఇష్టపడే వారి వరకు అందరూ తమ ఇష్టాలకు తగ్గట్టుగా మార్కెట్ను గమనిస్తూ ఉంటారు. 2026 మార్చి నెల ఇప్పటికే పలు కీలక లాంచీలతో సందడి చేయగా, ఏప్రిల్ నెల అంతకు మించిన అప్డేట్స్తో రాబోతోంది.
ఎస్యూవీల హవా కొనసాగుతుండగానే, ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. పాత మోడళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు, పూర్తిగా సరికొత్త బ్రాండ్లను కూడా కంపెనీలు భారత్కు పరిచయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన కొనుగోలుదారులకు ఎంపిక చేసుకునేందుకు బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
ఏప్రిల్ నెలలో రాబోతున్న కార్ల విషయానికి వస్తే.. వోక్స్వ్యాగన్ తన పాపులర్ మోడల్ టైగూన్ను మరింత స్టైలిష్గా ముస్తాబు చేసి ఏప్రిల్ 9న విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిలో లోగో, కనెక్టెడ్ లైట్లు వంటి కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి. అలాగే ఎమ్జీ మోటార్స్ తన గ్లోస్టర్ స్థానంలో ‘మెజెస్టర్’ అనే భారీ ఎస్యూవీని లాంచ్ చేస్తోంది. ఇది చూడటానికి చాలా గంభీరంగా ఉండటమే కాకుండా శక్తివంతమైన ఇంజిన్తో టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లకు సవాల్ విసరనుంది.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టయోటా కంపెనీ తన తొలి ఈవీ ‘ఎబెల్లా’ను భారత మార్కెట్లోకి తెస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్ 24న సీఎల్ఏ ఈవీని లాంచ్ చేస్తోంది. దీని రేంజ్ ఏకంగా 792 కిలోమీటర్లు ఉంటుందని సమాచారం.
మార్చి నెలలో స్కోడా కుషాక్, రెనాల్ట్ డస్టర్ వంటి కార్లు ఇప్పటికే సందడి చేశాయి. హ్యుందాయ్, టాటా కంపెనీలు కూడా తమ మోడళ్లను అప్డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఏప్రిల్ నెల ఒక మంచి అవకాశంగా మారనుంది.
తాజావార్తలు
-
Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్పై షాకింగ్ అప్డేట్స్!
-
Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్