జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ మరువకముందే మరో ఘటన.. అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు సమాజంలో ఆడపిల్ల పుట్టాలి అంటేనే భయపడేలా చేస్తున్నారు కొందరు మృగాళ్లు.. ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు.. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ పబ్ లో మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువకముందే మరో ఘటన వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇద్దరు యువకులు ట్రాప్ చేసి గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన చిలకల గూడ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో హైదరాబాద్ కు వలస వచ్చారు.. ఆయనకు ఇద్దరు
మైనర్ కూతుళ్లు.. ఇద్దరూ ప్రస్తుతం చదువుకుంటున్నారు.. అయితే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వారి ఫోన్ లో సోషల్ మీడియా ను వాడుతుంటారు. అలాగే పెద్ద కూతురుకు ఇన్స్టాగ్రామ్ లో అంబర్ పేట లాల్ బాగ్ కు చెందిన మహ్మద్ నవాజ్ (21) పరిచయమయ్యాడు. ఆ పరిచయం పెరిగి స్నేహంగా మారింది. నిత్యం చాట్ లు, ఫోన్లు చేసుకుంటూ ఉండేవాళ్లు. ఇక ఆ స్నేహంతో ఒక్కసారి కలవాలని చెప్పి ఆమెను రూమ్ కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ ఘటనను వీడియో తీసి ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ వీడియో చూపించి బెదిరించి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఇక మరోపక్క చిన్న కూతురు కూడా మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ (23) అనే యువకుడి ప్రేమలో పడింది. మాయమాటలు చెప్పి అహ్మద్ ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత కొన్ని రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇక ఇద్దరు కూతుర్లు ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే ఏమైందని తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో వారు నిజం కక్కారు.దీంతో వారు తమ పిల్లలతో కలిసి ఈ నెల 8న చిలకలగూడ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు నిందితులపై ఐపీసీలోని అత్యాచారం సెక్షన్లు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఇద్దరు యువకులు నిందితులని, అంతకుముందు పలుకేసుల్లో వీరు జైలుకు కూడా వెళ్లినట్లు పోలీసులు చెప్పడంతో బాలికలు అవాక్కయ్యారు. అనంతరం బాలికలకు పోలీసులు కౌన్సులింగ్ ఇచ్చి పంపించారు. సోషల్ మీడియా లో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవద్దని, ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.
Also Read
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!