‘దిశ’ అరాచకానికి రెండేళ్లు.. ఇంకా పెరుగుతున్న కామాంధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ రెండేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిందితులందరిని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. ఆ ఘటన ఇప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకుపుట్టక మానదు. అసలు ఆరోజు ఏం జరిగిందో మరోసారి తెలుసుకుందాం.
శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశ తన పని ముగించుకొని స్కూటీమీద ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యంలో ఆమె స్కూటీ ఆగిపోవడంతో తన చెల్లికి ఫోన్ చేసి భయమేస్తోంది అని చెప్పిన ఆమె తెల్లారి శవంలా కనిపించింది. అయితే ఆమె బైక్ కి ముందుగానే పంచర్ చేసిన నలుగురు దుర్మార్గులు.. ఆమెను హైదరాబాద్ శివారుల్లో షాద్ నగర్ వద్దకు లాకెళ్లి అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ఎన్నో వాదనలు వినిపించాయి.. ఎన్నో గొంతులు లేచాయి. ఎన్ని చేసినా ఆ యువతి ప్రాణం తిరిగి రాలేదు.. కానీ, అలాంటి నిందితులు మాత్రం ప్రాణాలతో ఉండకూడదని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను వెతికిమరి కాల్చి పడేశారు. ఈ ఘటన తరువాత ఆడవారికి రక్షణ కల్పిస్తూ దిశా చట్టాన్ని అమలు చేశారు. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఇకపోతే ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఆ ఘటన తరువాత దిశా అనే చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.. కానీ, ఇంకా ఎంతోమంది ఆడవారు కామాంధుల కబంద హస్తాలలో నలిగిపోతూనే ఉన్నారు. నిత్యం కామాంధుల చేతుల్లో ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. చిన్నా పెద్ద, వావివరుస.. ఆడ,మగా అని తేడా లేదు.. 6 ఏళ్ళ బాలిక నుంచి 60 ఏళ్ళ బామ్మ వరకు రోజు ఎక్కడో చోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ కామాంధుల ఆగడాలకు అంతు ఎక్కడ ఉందో తెలియాలి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..